కత్తి మహేష్‌కు రూ. 17 లక్షలిచ్చిన ఏపీ సర్కార్..!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కత్తి మహేష్‌కు.. ఏపీ ప్రభుత్వం రూ. పదిహేడు లక్షల ఆర్థిక సాయం చేసింది. ఆయన ప్రస్తుతం చెన్నై ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన తలకు.. కాళ్లకు గాయాలుకావడంతో కొన్ని ఆపరేషన్లు చేఏశారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. కత్తి మహేష్ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. ఆ పార్టీ తరపున తిరుపతి ఉపఎన్నికలలో కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రమాదం జరిగినా… వైసీపీ వైపు నుంచి పెద్దగా సాయం అందడం లేదని.. ఆయన భార్య విమర్శలు చేసినట్లుగా .. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.

ఈ లోపు.. ప్రభుత్వమే.. ప్రత్యేకంగా స్పందించి.. ఎవరూ దరఖాస్తు చేయకపోయినా.. రూ. పదిహేడు లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుండి సోషల్ మీడియాలో రెండు వర్గాలు తయారయ్యాయి. రకరకాల చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై మాత్రం పట్టించుకునేవారు కరవయ్యారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అంటే.. తక్కువ మొత్తంతో అయ్యే పని కాదు. ఆయన మిత్రులు చాలా మంది ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రటనలు చేశారు.

అయితే చివరికి.. ఎవరూ పెద్దగా సాయానికి ముందుకు వచ్చినట్లుగా లేదు. చివరికి ప్రభుత్వమే స్పందించి.. ప్రజాధనాన్ని రూ. 17 లక్షలు ఇచ్చింది. ప్రతీ రోజు.. ప్రమాదాల్లో కొన్ని వందల మంది గాయపడుతూంటారు. కానీ వారెవరికీ దక్కని అదృష్టం.. వైసీపీకి మద్దతు తెలిపినందుకు కత్తి మహేష్‌కు లభించింది. గతంలో వైసీపీ కార్యకర్తలు గాయపడినా.. ఆరోగ్యశ్రీ కింద మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి వచ్చేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close