సుగాలీ ప్రీతి కుటుంబానికి జనసేన “న్యాయం”..!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాల ఘటనలు రోజూ వెలుగు చూస్తున్నాయి. మహిళా కమిషన్ చైర‌్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ప్రతీ రోజూ..జిల్లాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి నిందితుల్ని వదిలి పెట్టబోమనే హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా… సుగాలీ ప్రీతి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ హామీ ఇచ్చినా సుగాలీ ప్రీతి కుటుంబానికి న్యాయం జరగలేదని..ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఉంటే ఒకటి..లేకపోతే ఒకటా అని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు.. కార్యకర్తలు ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకుని క్యాంపైన్ నిర్వహిస్తున్నారు.

జనసేన సైనికులసోషల్ మీడియా ఉద్యమంతో ప్రభుత్వం కూడా స్పందించింది. దిశపై జరిపిన సమీక్షలో సీఎం జగన్ కూడా సుగాలీ ప్రీతి కుటుంబానికి న్యాయంపై చర్చించారు. సీబీఐ విచారణ కోసం మరోసారి కోర్టుకెళ్లాలని నిర్ణయించారు. వారి కుటుంబానికి సాయంపైనా అధికారులతో చర్చించారు. ఆ తర్వాత సుగాలి ప్రీతి తల్లిదండ్రులతో కర్నూలు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప సమావేశం అయ్యారు. ప్రీతి తల్లిదండ్రులకు 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ప్రీతి తండ్రి రాజునాయక్‌కు ఉద్యోగం ఇస్తామని.. ప్రీతి తల్లి పార్వతి కాలికి ఆపరేషన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

2017లో కర్నూలులోనే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో అనుమానాస్పద స్థితిలో సుగాలీ ప్రీతి చనిపోయింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన వారే ఆమెను దారుణంగా హత్య చేశారని.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అప్పటి నుండి ఉద్యమమం చేస్తున్నారు. జనసేన నేతలు..సుగాలి ప్రీతికి న్యాయం కోసం సోషల్ మీడియాలోపోరాటం చేస్తే.. పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. చివరికి..ప్రభుత్వం సీబీఐకి ఇస్తున్నట్లుగా ‌ గతంలోజీవో జారీ చేసింది. కానీ.. సీబీఐ విచారణ ప్రారంభమయ్యేలా చేయడానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోలేదు. దీనిపై జనసేన సోషల్ మీడియానే మళ్లీ స్పందించి ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close