సోనాక్షీనీ వ‌ద‌ల‌ని బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు క‌థ‌లు వినిపించ‌డం, ఆయ‌న‌తో సినిమా ఓకే చేయించుకోవ‌డం చాలా సుల‌భ‌మైన విష‌యాలు. కానీ ఆయ‌నకు త‌గిన క‌థానాయిక‌ని ప‌ట్టుకోవ‌డానికి మాత్రం త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తుంటుంది. బాల‌య్యకి ఎప్ప‌టి నుంచో క‌థానాయిక‌ల కొర‌త ఉంది. బాల‌య్య‌కు భ‌య‌ప‌డ‌తారో, లేదంటే.. నిజంగానే డేట్లు సెట్ కావో తెలీదు గానీ – క‌థానాయిక‌ల అన్వేష‌ణ ఓ విక్ర‌మార్క ప్ర‌య‌త్నంలా సాగుతూనే ఉంటుంది.

తాజాగా బాల‌య్యకు మ‌రోసారి క‌థానాయిక‌ల కొర‌త ఎదురైంది. గోపీచంద్ మ‌లినేనితో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌లుంటారు. త్రిష‌, మెహ‌రీన్‌, శ్రుతి… ఇలాంటి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే వీళ్లెవ‌రూ హీరోయిన్లు కాద‌ని తేలిపోయింది. ఇప్పుడు సోనాక్షీ పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవ‌ల చిత్ర‌బృందం సోనాక్షిని సంప్ర‌దించిన‌ట్టు.. సోనాక్షి మాత్రం `నో` చెప్పిన‌ట్టు స‌మాచారం అందుతోంది. సౌత్ లో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ భామ‌లు ఉత్సాహం చూపిస్తున్న వేళ ఇది. పైగా ఇటీవ‌ల చిరంజీవి సినిమా కోసం సోనాక్షిని సంప్ర‌దించిన‌ట్టు, తాను ఒప్పుకున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో బాలయ్య‌కీ తాను ఓకే అంటుంద‌నుకున్నారు. కానీ.. `నో` అంటూ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సో.. బాల‌య్య కోసం క‌థానాయిక‌ల వేట అనే అంకం.. సీరియ‌ల్ లా సాగుతూనే ఉంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close