ఓ రాష్ట్రాధినేత వేదన ప్రధానికి పట్టదా..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదనను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదు. కృష్ణాజలాలను తెలంగాణ వాడేస్తోందని.. అడ్డుకోవాలని ఆయన అదే పనిగా ప్రధానికి.. మంత్రులకు.. కేఆర్ఎంబీకి లేఖలు రాస్తున్నా… స్పందన ఉండటం లేదు. ప్రధాని పట్టించుకోకపోయినా లేఖల మీద లేఖలు రాస్తున్న సీఎం జగన్ … ఇప్పటికైనా స్పందిస్తారేమోనని ఆశ పడుతున్నారు. తెలంగాణ సర్కార్ జలవిద్యుత్ ఉత్పత్తి ఆపకపోవడంతో ప్రధానికి ఈ సారి మరింత సుదీర్ఘమైన లేఖను రాశారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన.. అధికారులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని విజ్జప్తి చేశారు.

ఈ సారి లేఖల ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014ను ప్రస్తావించారు. లేఖలోతెలంగాణపై జగన్ పలు ఆరోపణలు చేశారు. కృష్ణా నదిలోని కామన్ రిజర్వాయర్లలో.. నిబంధనల్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని.. పునర్‌విభజన చట్టాన్ని తెలంగాణ గౌరవించడం లేదన్నారు. పదేపదే జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి లేఖపై.. అటు కేంద్రంలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతా జగన్ స్వయంకృతాపరాథమేనని తేల్చేస్తున్నారు. కేసీఆర్‌తో రాజకీయంగా మంచి సంబంధాలు నెలకొల్పుకుని రాష్ట్రం కోసం ప్రధానికి లేఖలు రాస్తే ఏం ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

విభజన చట్టంలో ఏపీకి రావాల్సినవి.. వదిలేసినవి ఏపీ సీఎంకు గుర్తు లేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆస్తుల పంపకం గురించి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. దాదాపుగా ఏపీకి రావాల్సిన ఏడు వేల కోట్ల కరెంట్ బకాయిల గురించీ ఒత్తిడి తీసుకు రాలేదు. గత ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ వేసింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణకు రాగానే.. ఈ ప్రభుత్వం ఆ పిటిషన్ ఉపసంహరించుకుంది. కానీ నిధులు మాత్రం అడగలేదు. ఇప్పుడు కూడా… కృష్ణా నీరంతా సముద్రం పాలవుతూంటే లేఖలతో టైంపాస్ చేస్తున్నారు. ఇద్దరు మిత్రులు రాజకీయం చేసుకుంటున్నారన్న అభిప్రాయంలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి లేదని.. వారే పరిష్కరించుకోవాలని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close