సలహాల పదవులు : ఒక్కరే రింగ్ మాస్టర్..మిగతా అంతా డమ్మీలే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రుల కంటే సలహాదారులు ఎక్కువ ఉన్నారు. వారికి క్యాబినెట్ ర్యాంకులు కూడా ఉన్నాయి. వివిధ శాఖలకు, ముఖ్యమంత్రికి కలిపి మొత్తం 37 మంది సలహాదారులు ఉన్నారు. వీరిలో నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించారు. ఆమె కాకుండా క్యాబినేట్ ర్యాంక్ లో పది మంది వరకు సలహాదారులు ఉన్నారు. వీరందరికీ లక్షలలో జీతాలు అందుతున్నాయి. జీత భత్యాలు కలిపి ఒక్కొక్కరికి నెలకు రూ. ఏడు లక్షల వరకూ అందుతూంటాయి. సలహాదారులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, విధానపరమైన నిర్ణయాలలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దడం వంటివి చేయాలి. కానీ ఒక్క సలహాదారుడు కూడా ఆ పని చేస్తున్నట్లుగా ఉండదు.

ఒకే ఒక్క సలహాదారు మాత్రం ఎప్పుడూ తెర వెనుక.. తెర ముందు కనిపిస్తూ ఉంటారు. మిగతా సలహాదారులకు కూడా ఆయన దిశానిర్దేశకుడు. ఆయనే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారునిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా ఉన్న అజయ్ కల్లాం కూడా ఓసారి మీడియాతో మాట్లాడి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ చేసిన ఫిర్యాదును మీడియా కు వివరించారు. అయితే ఆయన మీడియా ముందుకు రావాలన్నది కూడా.. సజ్జలే డిసైడ్ చేశారని.. సెక్రటేరియట్‌లో ఉండే అటెండర్‌కి కూడా తెలుసు.

మరికొందరు సలహాదారులు సజ్జల డైరక్షన్‌లో అనధికారిక మంత్రులుగా చెలామణి అవుతున్నారు. మరో సలహాదారు సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది సలహాదారులు కూడా తెర వెనుక ఉండి పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తీరుపై ప్రభుత్వ వర్గాల్లోనూ అసంతృప్తి ఉంది. సూపర్ సీఎంగా చెలామణి అవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో సలహాదారుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వంలోనూ కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం న్యాయవ్యవస్థను ఏ విషయంలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడూ తీసుకోదని కొంత మంది చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రులకు హైకమాండ్ వార్నింగ్… ఓడితే వేటు తప్పదా..?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రచారంలో దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తోంది. అయినా కొంతమంది...

దటీజ్ జగన్ – “ప్రతిభా ప్రదర్శన”లో అసలు తగ్గరు !

జగన్ మోహన్ రెడ్డి అంటే ఓక ఇది.. ఒక అది అని వైసీపీ నేతలు ఎలివేషన్లు ఇస్తూంటారు. కానీ ఎప్పుడు ప్రసంగించినా ఆయన ప్రతిభ ఏమిటో ప్రజల ముందు కనిపిస్తూనే ఉంటుంది. ...

నార్త్ కు మోడీ ప్రాధాన్యత…దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు రాలేనా..?

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్...

ఓటేస్తున్నారా ? : బోడిగుండుగా మారిన రుషికొండను గుర్తు చేసుకోండి !

చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close