డీఏ లేదు..పీఆర్సీ రాదు.. ! పాపం ఏపీ సర్కారీ ఉద్యోగులు..!

కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు కోత విధించింది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం డీఎలు కత్తిరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా జీతాలు సగం మేర రెండు, మూడు నెలల పాటు కత్తిరించాయి. ఆ తర్వాతతెలంగాణ సర్కార్ ఆ జీతాలను నాలుగైదు వాయిదాల్లో సర్దుబాటు చేసింది. ఏపీ ఇంకా ఆ పని కూడా చేసినట్లుగా లేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ లాక్ డౌన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయిన సమయంలో… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం.. స్వీట్ న్యూస్ చెప్పింది. డీఏను ఏకంగా పదకొండు శాతం పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయిన మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు.. బాధ అంతా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులదే. కరోనా కారణం చెప్పి డీఎలు.. పీఆర్సీలను పెండింగ్‌లో పెట్టారు. తెలంగాణ సర్కార్ ఒకింత మేలు. పీఆర్సీ ప్రకటించి.. అమలు చేయడానికి సిద్ధమయింది. డీఏలు కూడా మంజూరు చేశారు. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఒక్కటంటే.. ఒక్క డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. మొత్తంగా ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్కో ఉద్యోగి లక్షకుపైగా నష్టపోయారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పీఆర్సీ గురించి ఏపీ సర్కార్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అసలు ఇచ్చే ఉద్దేశంలో కూడా లేదు.

ఉన్న జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతూండటంతో ఉద్యోగ సంఘాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్రంలో ఉద్యోగులు..మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. సుఖంగా ఉంటే.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎక్కడా లేనంత నిస్సత్తువ వచ్చి పడుతోంది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎక్కువ మంది పౌర సేవలకు వచ్చే ప్రజల వద్ద నుంచి లంచాల రూపంలో పిండుకోవడానికి ఆసక్తి చూపిస్తారని అంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక బాధలు చూస్తూంటే ఇప్పుడల్లా ఏపీ సర్కార్ ఉద్యోగులకు రిలీఫ్ వచ్చే అవకాశం లేదని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close