స్వచ్ఛ అమరావతి.. ! ఇన్‌సైడర్‌ ఆరోపణల్ని కొట్టేసిన సుప్రీం..!

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ తేలిపోయాయి. నేరుగా సుప్రీంకోర్టే వాటిని కొట్టేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేదే లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని గత విచారణ సందర్బంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈ రోజు జరిగిన విచారణలో.. ప్రభుత్వపిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి .. అధికారంలోకి రాక ముందు నుంచీ చేస్తున్న ఆరోపణలు తేలిపోయినట్లయ్యాయి. రాజధాని ఎక్కడ పెడతారో ముందే సన్నిహితులకు తెలిపి.. వారితో భూములు కొనిపించారని.. ఆ తర్వాత రాజధాని ప్రకటించడం వల్ల పెద్ద ఎత్తున లాభం పొందారని.. ఇది లక్షల కోట్ల కుంభకోణం అని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని వైసీపీ నేతలు… జగన్మోహన్ రెడ్డి సహా ఆరోపిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన తరవాత దీనిపైనే విచారణ కూడా ప్రారంభించారు. అప్పట్లో భూములు కొన్న కొంత మందిని అదుపులోకి తీసుకోవడం.. ప్రశ్నించడం.. అమ్మిన వారి ఇళ్లకు వెళ్లి సీఐడీ అధికారులు హడావుడి చేయడం వంటివి చేశారు. తర్వాత ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అసలు ఫిర్యాదు దారులు లేకుండా… ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసి.. అసలు విచారణను కొట్టి వేసింది. దీనిపై ప్రభుత్వం హడావుడిగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులోనూ కేసు తేలిపోయింది. దీంతో అమరావతిపై జగన్మోహన్ రెడ్డి వేసిన అతి పెద్ద నింద.. నిజం కాదని తేలిపోయింది.

అయితే.. ఈ కేసు తేలిపోతుందని ముందే అనుకున్నారేమో కానీ.. దళితుల దగ్గర్నుంచి భూములు లాక్కున్నారంటూ.. అసైన్డ్ భూములపై కుట్ర చేశారంటూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసును సీఐడీ పోలీసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఇక్కడ కూడా దళిత రైతులెవరూ.. తమను ఎవరూ బెదిరించలేదని ఇష్టపూర్వకంగానే అమ్ముకున్నామని చెబుతున్నారు. కానీ ఏపీ సర్కార్‌తో పాటు.. కొన్ని అనుకూల మీడియాల్లో మాత్రం విస్తృతంగా కుంభకోణం అంటూ ప్రచారం చేసి.. ఇప్పటికీ హడావుడి చేస్తూనే ఉన్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో .. అమరావతిపై పడిన అతి పెద్ద నింద తొలగిపోయినట్లయింది. ఈ కారణంతోనే రాజధానిని తరలించాలనుకున్న ప్రభుత్వానికి ఇది షాక్ లాంటిదేనని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=Eou1oqvFa9COa1uy విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close