వైసీపీలో రెండున్నరేళ్ల ఫోబియా..! ఓ రేంజ్‌లో రేస్..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండున్నరేళ్ల అంశం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో 90 శాతం మందిని రెండున్నరేళ్ల తర్వాత తీసేసి కొత్త వారికి చాన్సిస్తామని సీఎం జగన్ పదవి చేపట్టినప్పుడే ప్రకటించారు. దీంతో రెండున్నరళ్ల సమయం దగ్గర పడుతోంది. ఈ కారణంలో.. ఎవరెవరి పదవులు పోతాయి.. కొత్తగా ఎవరెవరికి దక్కుతాయి అన్న అంశంపై వైసీపీలో అంతర్గతంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పదవులు నిలబెట్టుకోవాలనుకునేవారు.. కొత్తగా పదవులు పొందాలనుకునేవారు పెద్ద ఎత్తున తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

ప్రయత్నాలంటే… గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకోవడం కాదు. వైసీపీలో గాడ్ ఫాదర్లు అంటూ ఎవరు ఉండరు. ఉండేది ఒక్క జగన్మోహన్ రెడ్డే. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు.. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారంతా పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు ముఫ్పై ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారని పొడిగితే.. మరొకరు ప్రధానమంత్రి అవుతారని.. కితాబిస్తున్నారు. ఇక.. ఏపీకి జగన్ ఏం చేశారో.. ఎంత అద్భుతమైన పాలన అందించారో మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. పొడగ్తల విషయంలో కొంత మందికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రశంసలు వచ్చాయి.

సాక్షాత్తూ అసెంబ్లీలో రఘురామకృష్ణరాజును అన్‌ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తిట్టిన పెడన ఎమ్మెల్యేకు జగన్ ప్రశంసలు ఇచ్చారు. దీంతో ఆయనకు అదే పెద్ద సర్టిఫికెట్ అయిపోయింది. జగన్‌కు ఎలాంటి విమర్శలు .. పొగడ్తలు ఇష్టమో తెలుసు కాబట్టి.. ఆ దిశగా అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రేసు ముందు ముందు మరింత జోరుగా సాగే అవకాశం ఉంది. త్వరలో ఈ పొగడ్తులు ఎవరూ ఊహించని స్థాయికి చేరే చాన్స్ కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close