జీఎస్టీ కట్టకపోతే జైల్లో పెట్టరా “మోడీ బ్రదర్”..!?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ జీఎస్టీ కట్టవద్దని మహారాష్ట్ర వ్యాపారులకు సూచించడం.. దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. ప్రహ్లాద్ మోదీ.. ప్రస్తుతానికి వ్యాపారుల సంఘాల్లో కీలకంగా పని చేస్తున్నారు. వాటి తరపున ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఓ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ జీఎస్టీపై చర్చ జరిగింది. దీంతో ప్రహ్లాద్ మోడీ ఆవేశపడ్డారు. ” మోడీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారు మన సమస్యలు వినాలి..మనమేమీ బానిసలం కాదు” అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. మనం అంటే ఆయన ఉద్దేశంలో వ్యాపారులన్నమాట. మోడీ తమ్ముడిగా కాకుండా… వ్యాపారవేత్త మోడీగా ఆయన మాట్లాడారు.

“జీఎస్టీ చెల్లించబోం” అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని ఆయన వ్యాపారులకు సూచించారు. వ్యాపారులను కేంద్ర రాష్ట్రాలు పట్టించుకోవడం లేదనేది ప్రహ్లాద్ మోడీ అభిప్రాయం. జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా చేయాలని.. ప్రధాని మోడీ సహా.. యంత్రాంగం అంతా ప్రచారం చేస్తూ ఉంటుంది. తాము ఎంతో సరళమైన పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టామని చెబుతూంటారు. కానీ స్వయంగా వ్యాపారవేత్త అయిన ప్రధాని మోడీ సోదరుడికి మాత్రం.. ఈ జీఎస్టీ లెక్కలు అర్థం కాలేదు. అవి భారంగా ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

జీఎస్టీ కట్టకపోతే.. అధికారులు ఊరుకోరు. వెంటనే కేసు బుక్ చేస్తారు. కావాలంటే సీబీఐని రంగంలోకి దింపుతారు. తర్వాత వ్యాపారసంస్థల్ని మూసివేయిస్తారు. ఇదంతా జరిగే ప్రక్రియ. మరి మోడీ సోదరుడు మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం ఉందని అంతలా ఆవేశపడ్డారో లేక నిజంగానే.. వ్యాపారవేత్తగా ప్రకటన చేశారో క్లారిటీ లేదు. ఆయన మోడీ సోదరుడు.. తమ వ్యాపారుల సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ ఎందుకో వ్యాపారుల్ని రెచ్చగొట్టేందుకే ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close