ఒలింపిక్స్ : గోల్ఫ్‌లోనూ మరో పతకం ఖాయం..!?

ఒలింపిక్ క్రీడల్లో భారత్ అనూహ్యమైన విజయాలు నమోదు చేస్తోంది. పతకాలు తెచ్చేవారు కొందరైతే ఎవరూ ఊహించని విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న వారు మరికొందరు. ఈ జాబితాలోకి కొత్తగా గోల్ఫర్ అదితి అశోక్ చేరారు. ఆమె గోల్ఫ్ క్రీడాకారిణి. ఎవరూ ఊహించని ఈ విభాగంలో ప్రస్తుతం ఆమె రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మరొక్క రౌండ్ మిగిలి ఉంది. ఆ రౌండ్‌లోనూ ఆమె మెరుగైన ప్రదర్శన కనబరిస్తే… స్వర్ణం వస్తుంది.. లేదంటే రజతంతో సంతృప్తి పడాల్సి ఉంటుంది. మూడు రౌండ్లు ముగిసేసరికి టాప్ టూ స్థానంలో నిలిచింది.

గోల్ఫ్ విభాగంలో భారత ఆటగాళ్లు పోటీ పడుతున్నారన్న విషయం కూడాచాలా మందికి తెలియదు. ఆమె ఫైనల్‌కు చేరే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా అన్నదానిపై అదితి అశోక్ అసలు దృష్టి పెట్టలేదు. స్కోర్ సాధించడంపైనే దృష్టి పెట్టింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే విభాగంలో రెండో నిలిచిన అదితికి ఈ ఈవెంట్లో రజతం సాధించే అవకాశముంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్‌ ముగిసేసరికి అదితి 201 పాయింట్లు సాధించారు. అతి తక్కువ పాయింట్లు సాధించిన వారు విజేతలుగా నిలిస్తారు. అమెరికాకు చెందిన నెల్లి అదితి కన్నా మూడు పాయింట్లు తక్కువ సాధించి మొదటి స్థానంలో ఉన్నారు.

ఫైనల్ శుక్రవారమే జరగాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారానికి వాయిదా పడింది. ఒకవేళ శనివారం కూడా పోటీలు జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతాన్ని ప్రదానం చేస్తారు. పోటీలు జరిగి మెరుగైన ప్రదర్శన చేస్తే స్వర్ణం వస్తుంది . ఎంత ఘోరమైన ఆటతీరు కనబరిచినా.. కాంస్య ఖాయమని అంచనా వేస్తున్నారు. పతకం ఖాయమైతే.. జరిగితే ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్గా అదితి అశోక్ చరిత్ర సృష్టిస్తారు. ఈ ఒలింపిక్స్‌లో కొత్త కొత్త విభాగాల్లో భారత ఆటగాళ్లు సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close