బీజేపీ లాగే కాంగ్రెస్‌నూ గందరగోళపరుస్తున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ రాజకీయాల్లో డబుల్ గేమ్ ఆడుతోంది. ఓ వైపు బీజేపీకి దగ్గర అన్నట్లుగా కనిపిస్తూనే కాంగ్రెస్ పార్టీ విందు భేటీలకు హాజరవుతోంది. కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్.. ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశం ఎజెండా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఎలా సమైక్యం కావాలన్నదే. దీనికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు హాజరైతే పెద్ద విశేషం లేదు కానీ… టీఆర్ఎస్ కూడా హాజరైంది. దీంతో ఢిల్లీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చ ప్రారంభమయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీతో రణమేనని నినాదం చేశారు. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలందర్నీ కలిసి తెల్లజెండా ఎగురవేశారు. తర్వాత రణం లేదు రాజీ లేదు అని ప్రకటించారు. కానీ ఎక్కువగా రాజీ పడుతున్నారు.

అయితే ఆయన వ్యూహాత్మకంగానే అలా వ్యవహరించారని అప్పటి వరకూ దూకుడుగా వెళ్లిన బీజేపీకి కేసీఆర్ వ్యూహంతో బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా హాజరవడం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరవాత కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీని కూడా గందరోగళంలో పడేయానికి ఇలాంటి సమావేశాలను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో ప్రారంభమైయింది. నిజానికి ఢిల్లీలో కపిల్ సిబల్ నిర్వహించిన విందు భేటీకి కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఉందో లేదో క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయనకు… ఇటీవలి కాలంలో… హైకమాండ్‌తో గ్యాప్ పెరిగింది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీని ఓడించడానికని బీజేపీయేతర పార్టీలతో సమావేశం నిర్వహించడం … దానికి టీఆర్ఎస్ హాజరు కావడం చాలా మందికి అర్థం కాని రాజకీయ సమీకరణంగా మారింది. కానీ తెలంగాణలో పరిస్థితులు.. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు తెలిసిన వారు మాత్రం… జాతీయ పార్టీలను ఎలా గందరగోళంలో పడేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసని అంటున్నారు.

బీజేపీ ఊపు మీద ఉన్నప్పుడు ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు.. కాంగ్రెస్‌ రేసులోకి వస్తే ఆ పార్టీకి దగ్గరయినట్లుగా సంకేతాలు పంపితే… తెలంగాణలో ఆ రెండు పార్టీల నేతలు చల్లబడిపోతారని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీపై ఈ అస్త్రం విజయవంతమయింది. బీజేపీలో చేరే ముందు ఈటల … ఇదే అంశంపై తన అనుమానాన్ని బీజేపీ హైకమాండ్ వద్ద వ్యక్తం చేయడమే ఈ స్కెచ్ హైలెట్ అయిందని చెప్పుకోవడానికి సాక్ష్యం. ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్‌పై ప్రయోగిస్తున్నారని అంటున్నారు. కొద్ది రోజుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేలా కొన్ని కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నేతలు పాల్గొంటే… ఖచ్చితంగా అదే ప్లాన్ అని అంచనా వేసుకోవచ్చంటున్నారు. అదే జరిగిదే… ఆ సిట్యూయేషన్‌ను ఫేస్ చేయడం.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు చాలా పెద్ద టాస్కెనని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close