కాంగ్రెస్ గెలిస్తే దళిత ముఖ్యమంత్రట..!

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీలో మరో చర్చలకు తెర తీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ప్రయత్నిస్తానని ఆయన ప్రకటించి కలకలం రేపారు. దళిత బంధు విషయంలో కేసీఆర్‌ను విమర్శించినట్లుగా విమర్శించి సొంత పార్టీలో ఆయన కలకలం రేపే మాటలు మాట్లడటంతో రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ప్రారంభమయింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో హుషారు వచ్చింది. అందరూ యాక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ మునుపెన్నడూ లేని విధంగా సవాల్ విసురుతోందని టీఆర్ఎస్‌కూ అర్థమైపోయింది.

నిన్నటి వరకూ రేవంత్ పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ మరింత దిగజారిపోతుదంన్నట్లుగా మాట్లాడిన కోమటిరెడ్డి ఇప్పుడు గెలిపు గురించి .. గెలిస్తే ముఖ్యమమంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రోత్సాహకర ఫలితాలు వచ్చినా ఆ క్రెడిట్ పూర్తిగా రేవంత్ రెడ్డికే వస్తుందనడంలో ప్రత్యేకంగా సందేహం లేదు. నిజంగానే రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో 72 సీట్లు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి పదవి రేసులో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

హైకమాండ్ కూడా ఆయన వైపే మొగ్గుతుంది. అది సహజం. తనకు ఇమ్మంటే ఇవ్వరు కాబట్టి కనీసం రేవంత్ ను అయినా ఇరుకున పెట్టడానికి దళిత ముఖ్యమంత్రి వాదనను కోమటిరెడ్డి తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారం కోసం కాంగ్రెస్ పోటీపడే స్థితికి చేరిందని కోమటిరెడ్డి అంగీకరించారని రేవంత్ వర్గీయులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close