టాలీవుడ్ ఆర్థిక మూలాలపైనే ఈడీ గురి..!

డ్రగ్స్ పేరుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సినీ ప్రముఖులను ప్రశ్నించడానికి రంగంలోకి దిగింది. కానీ అసలు డ్రగ్స్ కేసు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మనీ లాండరింగ్ అంశంపైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కేవలం డ్రగ్స్ కేసులకు సంబంధించి చేసిన మనీ ట్రాన్స్‌ఫర్లు కాదు. ప్రతీ లావాదేవీని పరిశీలిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. విదేశాలకు నిధులు ఎందుకు పంపారు.. మళ్లీ ఎలా స్వీకరించారు వంటి వాటిని ఆరా తీస్తున్నారు. పూరి జగన్నాథ్ వైపు నుంచి ఈ తరహా లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. పూరీతో పాటు వ్యాపారం చేస్తున్న, సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన చార్మి అకౌంట్ నుంచి కూడా ఈ లావాదేవీలు ఉన్నాయి.

రూ. కోట్లలో ఉన్న విదేశీ నగదు లావాదేవీలను ఈడీ ప్రస్తావించడంతో పూరి జగన్నాథ్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. కేవలం డ్రగ్స్ కేసులో అనుమానితులకు పంపిన డబ్బుల గురించి మాత్రమే ప్రశ్నిస్తారని ఆయన అనుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ తర్వాత అసలు లావాదేవీల గురించి ప్రశ్నించడంతో బండ్ల గణేష్ విషయాన్ని ప్రస్తావించారు. అప్పటికప్పుడు ఈడీ అధికారులు బండ్లను కూడా పిలిపించారు. కానీ తనకేమీ తెలియదని .. పూరిని పూర్తిగా ఇరికించి వచ్చినట్లుగా తెలుస్తోంది. పూరి బిజినెస్ పార్టనర్ చార్మిని బుధవారం ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. ఆ తర్వాత నుంచి మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సాధారణంగా సినీ పరిశ్రమ అంటే చాలా వరకూ లావాదేవీలు గుట్టుముట్టుగానే సాగుతాయి. అధికారికంగా జరిగే లావాదేవీలు తక్కువే ఉంటాయి. మనీ లాండరింగ్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ అంశంపై దర్యాప్తు ఎవరూ ఇంత వరకూ పెద్దగా దృష్టి పెట్టలేదు. బడా బడా నిర్మాణ సంస్థలు చాలా వరకూ నిక్కచ్చిగానే ఉన్నా.. కొత్తగా వస్తున్న నిర్మాతలు ఎక్కువగా లెక్క చూపని డబ్బుల్నే పెట్టుబడిగా పెడుతున్నారు. ముఖ్యంగా బినామీలుగా పేరు పడిన వారు ఇలా ఇతరుల అక్రమ సంపాదనను సినీ పరిశ్రమలోకి తరలిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈడీ ఈ మొత్తం నగదు లావాదేవీల్ని బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది.

ఈడీ విచారణ ముందుకు జరిగే కొద్దీ డ్రగ్స్ కోణం పూర్తిగా పక్కకుపోయే అవకాశం ఉంది. కేవలం మనీలాండరింగ్ అదీ కూడా పూర్తి స్థాయిలో జరిగిన అక్రమ లావాదేవీలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడివి.. ఎవరు ఇచ్చారు… ఎలా తరలించారు.. ఎందుకు తరలించారు ఇలాంటివన్నీ బయటకు తీస్తే టాలీవుడ్‌లో ఆర్థిక మూలాలన్నీ బయటపడతాయి. అదే సమయంలో రాజకీయ ప్రకంపనలు కూడా రేగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close