సాయిధర్మతేజ్‌కు ప్రమాదం – అపస్మారక స్థితిలో హీరో

హీరో సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురయ్యారు. ఆయన తన స్పోర్ట్స్ బైక్‌పై జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చి బౌలి వైపు వెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయినట్లుగా తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న బైక్ ఒక్క సారిగా స్కిడ్ కావడంతో సాయిధర్మతేజ్ పడిపోయారు. దీంతో ఆయనకు కుడి కన్ను పైన, అలాగే చాతి భాగంలో బలమైన ఒత్తిడికి గురయిన గాయాలు ఉన్నాయి. పొట్ట భాగంలోనూ శరీరం ఒత్తిడికి గురయినట్లుగా తెలుస్తోంది. పైకి భారీ గాయాలు కనిపించడం లేదు.

కానీ ఆయన ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు వెంటనే హుటాహుటిన సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత అపోలోకు మార్చినట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా ఏమైనా గాయాలయ్యాయేమో డాక్టర్లు స్కాన్ చేసి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్ నెమ్మదైన వ్యక్తిగానే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఆయన రాష్ డ్రైవింగ్ చేయడం లాంటివేమీ ఉండవని అంటారు.

అలాంటి హీరో ఒక్క సారిగా ప్రమాదానికి గురయినట్లుగా తెలియడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ.. మెచ్యూర్డ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close