ఇక ఫైబర్ నెట్ అవినీతి కథలు !

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతోంది. ఇంత కాలం ఏం చేశారో కానీ ఇప్పుడు ఫైబర్‌నెట్‌లో అక్రమాల పేరుతో సీఐడీ కేసులు నమోదు చేయించి విచారణ ప్రారంభించారు. మొత్తం 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాటిని కొన్ని మీడియా వర్గాలకు లీ‌క్ చేశారు. ఇక మీడియా వర్గాలు తమ శక్తికి మించి ఆ స్కాంను రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఒకరు రూ. రెండు వేల కోట్ల దాకా వెళ్లిపోయారు. చాలా మంది రూ. 321 కోట్ల దగ్గర ఉండిపోయారు. ఎందుకంటే ఆ ఫైబర్ నెట్‌లో పనులు జరిగింది ఆ రూ. 321కోట్ల వరకే. అందుకే అది మొత్తం అవినీతి అని చెబితే కాస్త నమ్మబుల్ గా ఉంటుందేమో అనిఅక్కడే ఆగిపోయారు. కానీ కొంత మంది అత్యుత్సాహ ప్రో వైసీపీ మీడియా మాత్రం రూ. రెండువేల కోట్ల వరకూ వెళ్లిపోయింది.

నిజానికి ఫైబర్ నెట్‌లో స్కామంటూ రెండేళ్లుగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్రంమాత్రం అందులో ఎలాంటి స్కామ్ లేదని ప్రకటించింది. పైగా తక్కువ ఖర్చుతో దాన్ని నిర్వహణలోకి తీసుకు వచ్చినందుకు అభినందించింది కూడా. అయితే ఏపీ ప్రభు్తవానికి మాత్రం అందులో స్కాం కనిపించింది. చివరికి రాజధాని కేసుల్లో దింపినట్లుగానే సీఐడీని రంగంలోకి దింపి.. పందొమ్మిది మందిపై కేసు పెట్టింది. అందులో హరిప్రసాద్ ఏ వన్ గా ఉన్నారు. కొంత మంది అధికారుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు చేస్తే చాలు… కోర్టుల్లో నిరూపించకపోయినా పర్వాలేదు.. మీడియా, సోషల్ మీడియా బలంతో ప్రచారం చేస్తే అదే రాజకీయ లాభం అనుకుంటున్నారు. రోజూ ఏదో ఓ పేపర్ బయట పెట్టి..ఇదిగో స్కాం అంటున్నారు. అందులో ఏ స్కాం ఉందో లేదో తెలియక జుట్టు పీక్కుని.. ఇంటర్నెట్‌లో అన్ని పత్రాలు వెదుక్కుని టీడీపీ నేతలు తూచ్ అని.. వివరాలు బయట పెట్టి వివరణ ఇవ్వాల్సి వస్తోంది. కొద్ది రోజుల కిందట వైసీపీ మీడియా లోకేష్ సంతకం చేసిన ఓ పత్రాన్ని చూపించి.. ఫైబర్ నెట్‌ స్కాంకు ఇదే పెద్ద సాక్ష్యం అని ప్రచారం చేశారు. చివరికి ఆ లేఖ ఓ అధికారిక కార్యక్రమానికి అనుమతి కోసం మంత్రి హోదాలో పెట్టిన సంతకంగా తేల్చారు.

ఢిల్లీకి సీఎం జగన్ ఎప్పుడు వెళ్లినా ఫైబర్ నెట్‌పై దర్యాప్తు చేయించాలని కోరేవారు. ఎంపీలదీ అదే పని. కానీ కేంద్రం మాత్రం చేయించలేదు. అయితే వారు చేయించకపోయినా ఇక్కడ సీఐడీ ద్వారా చేయించి.. మీడియాలో ప్రచారం ద్వారా అవినీతి ముద్ర వేస్తే స్వకార్యం తీరిపోతుందన్న వ్యూహం అమలు చేయడం ప్రారంభిచేశారని గతంలో నమోదైన అవినీతి కేసులు.. ప్రచార ఆర్భాటాన్ని బట్టి గుర్తు చేసుకోవచ్చన్న అభిప్రాయం సహజంగానే వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close