“జియో మార్ట్‌” ద్వారా టిక్కెట్లమ్మారని చెబితే దుష్ప్రచారమా !?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాము చేసిన పనులను మీడియా చెప్పినా దుష్ప్రచారం .. కేసులు పెడుతామంటూ హెచ్చరికలు చేయడం ప్రారంభించారు. శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను జియో మార్ట్ ద్వారా అమ్మడం నిజం. టీటీడీ వెబ్ సైట్‌ను క్లిక్ చేస్తే జియో మార్ట్‌కు మైగ్రేట్ అవడం కూడా నిజం. టీటీడీ అధికారులు చెప్పినట్లుగా కోటి మంది టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. అంటే టీటీడీ భక్తులకు తమకు అవసరం లేకపోయినా జియో మోర్ట్‌ వెబ్ సైట్‌ను కోటి సార్లు ఓపెన్ చేశారు. టీటీడీ తమ భక్తులను ఇలా జియో మార్ట్‌కు అప్పగించిందని విమర్శలు వచ్చాయి.

దీన్ని టీటీడీ పాలనాధికారులు ఖండించారు. దుష్ప్రచారం చేస్తున్నారని కేసులు పెడుతామని చెప్పుకొచ్చారు. నిజంగానే జియో మార్ట్ కు టిక్కెట్ల బాధ్యత అప్పగించినట్లుగా ఒప్పుకున్నారు. మరి ఏమని కేసులు పెడుతారు. ఎందుకు ఇచ్చారంటే శ్రీవారి భక్తులు ఉచితంగా సేవ చేస్తామంటే ఇచ్చామని చెబుతున్నారు. కోటి మంది శ్రీవారి భక్తుల్ని జియోమార్ట్ ఖాతాదారులుగా మార్చేసిన టీటీడీ… వారు ఉచిత సేవ చేస్తారంటే ఎవరు నమ్ముతారు. శ్రీవారి భక్తుల ఫోన్ నెంబర్లు.. ఏకంగా కోటి జియోమార్ట్ డేటాలో చేరిపోలేదా ?. ఇంకా క్లౌడ్ సేవలు.. రూ. మూడు కోట్లు అని టీటీడీ అధికారులు కబుర్లు కాస్త విలువవైనవే చెబుతున్నారు.

కానీ అలా ఇవ్వడానికి కూడా ఓ పద్దతి ఉంటుంది కదా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అయితే తమ తప్పిదాలు.. స్కాంలను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి కేసులు పెట్టడం అన్న ఒకే ఒక్క ఆప్షన్‌ను ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్నారు. అదే బెదిరింపులకు దిగుతున్నారు. చేసింది చెప్పినా దుష్ప్రచారం అంటున్నారంటే ఖచ్చితంగా వారు చేసిందని తప్పని వారు అంగీకరించడమనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close