జగన్ నిర్ణయంపై స్వరూపానంద అసంతృప్తి !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తన  ఆశీస్సులతోనే అన్నట్లుగా షో చేసే స్వరూపానందకు ఏపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం అసలు నచ్చలేదు. అదే బీసీ సంక్షేమ లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను విలీనం చేయడం. ఇటీవలే రిషికేష్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు చేయడం ప్రారంభించారేమో కానీ దేవాదాయశాఖ కింద ఉన్న  బ్రాహ్మణ కార్పొరేషన్‌ను.. బీసీ సంక్షేమ శాఖ కిందకు మార్చడం  గురించి ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ సమాచారాన్ని మీడియాకు కూడా తెలియచేశారు.

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాదు.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో స్వామీజీ  అందరికీ తెలియచేశారు. నిజంగా ఆయనకు నచ్చకపోతే నేరుగా సీఎంతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని ఉపసంహరింప చేసి ఆ తర్వాత మీడియాకు చెప్పి ఉండేవారు. కానీ తనకు నచ్చలేదని.. సీఎంవోతో మాట్లాడుతున్నామని స్వరూపానంద ఆశ్రమం ప్రకటన ఇచ్చింది.

ఈ అంశంలో బ్రాహ్మణ వర్గం నుంచి వ్యతిరేకత ఉందన్న కారణంగా ఇలా స్వరూపానందతో  ప్రకటన చేయించారన్న అభిప్రాయం కూడా కొంత మందిలో వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమర్థించడమే కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో స్వరూపాదనందకు తెలియకుండా ఉండదని అంటున్నారు. స్వరూపానంద చెప్పారని.. ఆయనకు నచ్చలేదని రేపు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మళ్లీ దేవాదాయశాఖకు కిందకు తెస్తారేమోనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో చివరి లైన్‌లో జగన్‌కు సీటు ?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి జగన్ వస్తారా రారా అన్నదానిపై అనేక చర్చలు ఉన్నాయి. వస్తారనే అనకుంటే ఆయన...

ఏపీ కేబినెట్‌లో చేరికపై ఎటూ తేల్చుకోలేకపోతున్న పవన్ !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేబినెట్‌లో చేరికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం పోస్టుపై ఆసక్తిగా ఉన్నారని జాతీయ మీడియా చెబుతోంది. కానీ పవన్ వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రావడం...
video

ఫుల్ మార్కులు కొట్టేసిన బాబీ

https://youtu.be/Ib7bmm-PiaU?si=RZnVotkRroghSeKs బాలకృష్ణని వెండితెరపై చూపించాలంటే బోయపాటి తర్వాత ఎవరైనా అనే అభిప్రాయం అందరిలో కలిగింది. నిజంగా బోయపాటి కూడా బాలయ్యలోని మాస్ ఎనర్జీని ఒడిసిపట్టుకున్నారు. బాలయ్యని ఎలా చూపిస్తే విజల్స్ పడతాయో అనే కిటుకు...

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ ఫోకస్ – ఏం జరగబోతుంది..?

కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా..? ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పోలీసు ఉన్నతాధికారుల భేటీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close