రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు అమిత్ షాతో కేసీఆర్ భేటీ !

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఆదివారం ఆ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా అమిత్ షా ఇంటికి వెళ్లారు. అక్కడ గంటన్నర సేపు చర్చలు జరిపారు. చర్చల ఎజెండా ఏమిటో స్పష్టత లేదు. మళ్లీ సోమవారం ఉదయం పలువురు కేంద్రమంత్రులను కలిసిన తర్వాత మధ్యాహ్నం మళ్లీ అమిత్ షా ఇంటికి వెళ్లారు. గంటన్నర సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

ఇలా రోజు మార్చి రోజు అమిత్ షాతో సమావేశం అయి చర్చించాల్సినంత అత్యంత ముఖ్యమైన విషయాలేమిటన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ప్రభుత్వ పరంగా తెలంగాణ అంశాలు చర్చించారన్న విషయాన్నీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా కేసీఆర్ ఇలాంటి భేటీలు నిర్వహించారంటే ఏదో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. కేసీఆర్ ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో అమల్లో పెట్టే వరకూ బయటకు తెలియనివ్వరు.

అమిత్ షాతో అలా చర్చలు జరుపుతున్నారంటే.. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మలుపులు కనిపించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదేమిటో అటు బీజేపీ వైపు నుంచి కానీ ఇటు టీఆర్ఎస్ వైపు నుంచి కాని స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ పరమైన విషయాలు మాత్రం ఇలా మాట్లాడే అవకాశం లేదని.. ఖచ్చితంగా రాజకీయమేనన్న అంచనా మాత్రం గట్టిగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close