తెలంగాణ ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఎప్పుడో !?

ప్రత్యక్ష ఎన్నిక అయిన హుజారాబాద్‌కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పెండింగ్‌లో పడిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికలెప్పుడు అని టీఆర్ఎస్ నేతలు కిందా మీదా పడుతున్నారు. శాసనమండలికి శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగిసింది. గవర్నర్ కోటా నుంచి ఒకరి పదవీకాలం పూర్తైంది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. అయితే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. ఇటీవల ఎన్నికలు ఇప్పుడే వద్దని తెలంగాణ సర్కార్ ఈసీకి కూడాలేఖ రాసింది. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు నిర్వహిస్తూండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పెడతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులు తమ ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మె్ల్సీ స్థానానికి ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డి పేరును ఖరారు చేసి గవర్నర్‌కు పంపింది. ప్రస్తుతం ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. కేసీఆర్ పట్టుబడతారా లేకపోతే.. కౌశిక్ రెడ్డికి షాక్ ఇస్తారా అన్నది వేచి ఆసక్తికరంగా మారింది.

ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ భారీగా ఉంది. సీఎం పలు జిల్లాలకు చెందిన నేతలకు ఎన్నికల సమయంలో పదుల సంఖ్యలో మంచి పదవి ఇస్తానని చెప్పడంతో వారు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. పదువుల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది పదవీకాలంలో వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. అప్పుడు మరికొంత మందికి అవకాశాలు ఇస్తామని కొంత మందిని బుజ్జగించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close