నాగార్జున ఎంట్రీ ఇచ్చినా “డీల్” సెట్ కావడం లేదా !?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేకపోయినా భారీ సినిమాలు విడుదల చేయాలంటే.. తెలంగాణలో లాంటి పరిస్థితులు ఏపీలో ఉండాలి. టిక్కెట్ల ధరలు, ధియేటర్లకు అనుమతులు, బెనిఫిట్ షోలు, ఆన్ లైన్ టిక్కెట్ల వివాదం ఇలా అనేక అంశాల పరిష్కారం కాకుండా పడి ఉన్నాయి. ఈ క్రమంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ప్రచారంలో ఉన్న నాగార్జున ప్రత్యేక విమానంలో వచ్చి జగన్‌తో చర్చించి వెళ్లారు. తర్వాతి రోజే దిల్ రాజు టీమ్ వచ్చి పేర్ని నానిని కలిసింది.

పేర్ని నాని అడిగిన సమాచారం ఇచ్చామని నిర్మాతలు చెబితే.. కాఫీ తాగి వెళ్లడానికి వచ్చారని మంత్రి చెప్పారు. దీంతో చర్చలు జరుగుతున్నాయి కానీ డీల్ మాత్రం సెట్ కావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలకు బాక్సులు రెడీ అయ్యాయి. విడుదల చేద్దామంటే ఏపీలో పరిస్థితులు సహకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారమే టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో అమ్మాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే ఏపీలో సినిమా టిక్కెట్లన్నీ ప్రభుత్వ పోర్టల్ ద్వారానే అమ్మాల్సి ఉంటుంది. అయితే ఈ విధానానికి సినీ పెద్దలు అంగీకారం తెలిపారని ప్రభుత్వం చెబుతోంది.

కానీ ఆ అంగీకారం సరిపోవడం లేదు. ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు..నిర్మాతలు కూడా ఇప్పటికే టిక్కెట్లు అమ్ముతున్న పోర్టల్స్‌తో ఒప్పందాల గురించి చెబుతున్నారు. కలెక్షన్లు ఏ రోజుకారోజు ఇస్తారో లేదో చెప్పాలంటున్నారు. వీటన్నింటిపై టాలీవుడ్ – ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ పరిష్కారం కోసం ఓ డీల్ మాత్రం కుదరడం లేదు. ఎప్పటికి కుదురుతుందో.. ఎప్పటికి భారీ సినిమాలు విడుదలవుతాయో.. వేచి చూడాల్సిందే.!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close