14న తిరుపతిలో జగన్ – అమిత్ షా భేటీ !

కేంద్ర హోంమంత్రి అమిత ్షా ఏపీ పర్యటనకు వస్తున్ారు. అయితే ఈ సారి దైవ దర్శనానికో బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడానికో కాదు.. తన శాఖ బాధ్యతల్లో భాగంగా తిరుపతిలో నిర్వహిస్తున్న అత్యున్నత సమావేశంలో పాల్గొనేందుకు స్తున్నారు. తిరుపతిలో ఈ నెల 14న తిరుపతి తాజ్‌ హోటల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన సౌత్ జోన్ కమిటీ సమావేశం జరగనుంది. హోంమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల సీఎంలు, ముఖ్య కార్యదర్శులు, అండమాన్‌ నికోబార్‌ లక్షదీవుల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది.

నిజానికి ఈ సమావేశాన్ని మార్చిలో నిర్వహించాలని అనుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అప్పట్లో తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో సమావేశం వాయిదా పడింది. ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో బిల్లు మాత్రం ఏపీ ప్రభుత్వం రూ. కోటి పన్నెండు లక్షలు చెల్లించాల్సి వచ్చింది. కేంద్రహోంమంత్రితో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు కాబట్టి.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడానికి రూ. నాలుగు కోట్ల ఖర్చు అంచనా వేశారు. ఇప్పుడు అంత కంటే ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది.అయితే ఈ సారి సమావేశం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

అమిత్ షాతో ఇటీవల ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. అదే రోజు జగన్‌ జిమ్ చేస్తూండగా కాలు బెణకడంతో ఆయన వెళ్లలేకపోయారు. ఈ సారి కూడా అలాంటి ఇబ్బందులేమీ లేకపోతే ఖచ్చితంగా సీఎం జగన్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. స్వయంగా హోంమంత్రినే రాష్ట్రానికి హాజరవుతున్నందున వ్యక్తిగతంగానూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

స్టాలిన్ తమిళనాడు సీఎం అయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, కేంద్రం పెత్తనంపై చురుకుగా స్పందిస్తున్నారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం వాడి – వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close