పెట్రో ధరల తగ్గింపు ఎన్నికల స్కిట్లేనా? మళ్లీ పెంచేస్తారా ?

పెట్రో ధరలను కేంద్రం రూ. ఐదు తగ్గిస్తే చాలా రాష్ట్రాలు రూ. ఏడు వరకూ తగ్గించాయి. డీజిల్‌పైనా అంతే. దీంతో ఒక్క సారిగాచాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డిజిల్ రేట్లు దిగి వచ్చాయి. ఇది ప్రజలకు కాస్త ఉపశమనమే. కానీ ఎక్కువ మంది ప్రజలు నమ్మలేకపోతున్నారు. మళ్లీ పెంచడం ఖాయమని.. తగ్గింపు అనేది రాజకీయ ప్రయోజనాల కోసమేనని అనుమానిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంటే మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆ రాష్ట్రంలో గెలిస్తేనే తర్వాత మళ్లీ మూడో సారి కేంద్రం లో అధికారంలోకి వచ్చేది.

లేకపోతే సీన్ రివర్స్ అవుతుంది. అలాగే పంజాబ్‌తో పాటు మరో మూడు కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలుజరుగుతాయి. ఫలితాలు తేడా వస్తే బీజేపీ బేస్ కరిగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పెట్రోధరలు, గ్యాస్ ధరలు ఓట్ల ప్రయారిటీని డిసైడ్ చేస్తే బీజేపీ కొట్టుకుపోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా కేంద్రం కాస్త పన్నులను తగ్గించి.. రాష్ట్రాలను తగ్గించాలని కోరింది. ఇదే సందుగా ఉత్తరప్రదేశ్ సీఎం పెద్ద ఎత్తున ఎక్సైజ్ ట్యాక్స్ కట్ చేశారు. ఇప్పటి వరకూఎంత పన్ను వసూలు చేశారన్న సంగతి పక్కన పెట్టి ఎన్నికలకు ముందు స్కిట్స్ ప్రారంభించేశారు.

అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే చేస్తున్నాయి. పెద్ద ఎత్తున పన్నులను తగ్గిస్తున్నాయి. పెట్రోల్ ధరను వంద కంటే తక్కువ స్థాయికి తెస్తున్నాయి. ఇది బాగానే ఉన్నా ఎన్నికలైన తర్వాత మళ్లీ బాదేస్తారుగా అన్న అనుమానం మాత్రం ప్రజల్లో ఉంది. గత అనుభవాలు అదే్ చెబుతున్నాయి. ఎన్నికలు ఉన్నప్పుడల్లా పెట్రో ధరలు పెంచకుండా నిలుపుదల చేసి.. ఆ తర్వాత ఒక్క సారిగా రేట్లను పెంచేస్తూ ఉంటారు. ఈ సారి కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. అధికార పార్టీని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారో లేదో ఎన్నికల ఫలితాలు తేల్చేస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close