పార్టీ కనుమరగవుతున్న వేళ పార్టీ కార్యాలయం ఓపెనింగ్!

యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేయడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి తెలంగాణాలో తెరాసను విలీనం చేసుకొని అక్కడ తిరుగులేని రాజకీయ శక్తిగా నిలవాలనుకోవడం. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో…జరుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని కలలుకంటే, తెరాసయే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తనలో విలీనం చేసేసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ విధంగానయినా తన కోరిక నెరవేరుతోందని కాంగ్రెస్ అధిష్టానం సంతోషించాల్సిన దుస్థితి నెలకొంది.

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలయిన నేతలున్నప్పటికీ వారందరూ కేసీఆర్ వ్యూహాలని సమర్ధంగా ఎదుర్కొనలేక చేతులెత్తేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలలో వరుసపరాజయాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్న సాయంత్రం తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలతో హైదరాబాద్ గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. పార్టీ వరుస ఓటమికి కారణాలు అడిగి తెలుసుకొన్నారు. ఇప్పుడు ఆయనే కాదు…సాక్షాత్ రాహుల్ గాంధి దిగివచ్చినా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాలేరని స్పష్టమవుతోంది. కనుక మళ్ళీ పరిస్థితులు మారేవరకు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బారి నుండి కాపాడుకోగలగితే అదే గొప్ప విషయం అవుతుంది.

ఇక రాష్ట్ర విభజనతోనే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలయిందని చెప్పవచ్చును. అప్పటి నుండి కోలుకోనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా వేరే పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ తెదేపా విఫలమయినా ఆ ప్రయోజనం వైకాపా దక్కించుకోగలదు తప్ప కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొందామని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేసింది కానీ అవి కూడా ఫలించలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. మిగిలినవారందరూ రాహుల్ గాంధి, దిగ్విజయ సింగ్ వంటి నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడే మొహాలు చూపిస్తున్నారు. మరికొందరు పార్టీ మారడం కోసం తగిన సమయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఆంద్ర రత్న భవన్’ ని ప్రారంభించడానికి దిగ్విజయ సింగ్ ఈరోజు వస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఆరంభించడం నవ్వు తెప్పిస్తోంది.

కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణా ప్రజలు నేటికీ ఆ పార్టీని దూరంగా ఉంచుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా, వారి అభిప్రాయాలకు, మనోభావాలకు, ఉద్యమాలకు ఏమాత్రం విలువనీయకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎప్పటికయినా ఆదరిస్తారా? అంటే అనుమానమే. తెదేపా, వైకాపా, బీజేపీ మూడు పార్టీలు పూర్తిగా విఫలమయితేనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారేమో?కనుక అంతవరకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా కాపాడుకొంటారో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close