చిరు కెరియ‌ర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది

త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన సినిమా `వేదాళం`. తెలుగులో చిరంజీవితో `భోళా శంక‌ర్‌`గా తెర‌కెక్కిస్తున్నారు. మెహర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ చిత్రం వైభ‌వంగా ప్రారంభ‌మైంది. రాఘవేంద్ర‌రావు, కొర‌టాల శివ‌, బాబి, వినాయ‌క్ త‌దిత‌రులు ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని నిర్మాత‌లు అనిల్ సుంక‌ర‌, కె.ఎస్ రామారావు తెలిపారు.

”ఈ సినిమా కోసం మెహ‌ర్ ర‌మేష్‌ డే అండ్ నైట్ వ‌ర్క్ చేశారు. దాదాపుగా వ‌ర్జిన‌ల్ వెర్ష‌న్ లా త‌యారు చేశారు. స‌రిలేరు నీ కెవ్వ‌రుతో త‌మ‌న్నా మా ల‌క్కీ ఛార్మ్ అయ్యింది. త‌న‌ని ఈ సినిమాతో మ‌రోసారి రిపీట్ చేస్తున్నా”మ‌ని అనిల్ సుంక‌ర తెలిపారు. కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ”చాలా సంవ‌త్స‌రాల త‌ర‌వాత‌… ఇది నా జీవితంలో గొప్ప రోజు. మెహ‌ర్‌, అనిల్ సుంక‌ర ఇద్ద‌రూ… చిరంజీవిగారికి ద‌గ్గ‌ర న‌న్ను ద‌గ్గ‌ర చేసి, ఓ మంచి సినిమా తీయిస్తున్నారు. చిరంజీవిగారితో సినిమా చేయాల‌ని ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఎదురు చూస్తున్నా. ఇద్ద‌రి మ‌ధ్యా ఎందుకో తెలియ‌ని గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో నా పాత్రికేయ మిత్రుల భాగ‌స్వామ్యం కూడా ఉంటుంది. ర‌మేష్ తెలివి తేట‌లు, అనిల్ అమెరిక‌న్ డాల‌ర్ల‌తో… ఈ సినిమాని మ‌రింత‌ శ‌క్తిమంతంగా తీర్చిదిద్దుతామ‌న్న న‌మ్మ‌కం ఉంద‌”న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close