అంద‌రూ క‌లిసి ‘ప‌ద్మ‌శ్రీ‌’పై ప‌డ్డారేంటి

కంగ‌నా నోరు తెరిస్తేచాలు.. దాని చుట్టూ వంద వివాదాలు. తాజాగా దేశ స్వాతంత్ర్యం కోసం కంగ‌నా చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 1947లో దేశానికి వ‌చ్చింది నిజ‌మైన స్వాతంత్య్రం కాద‌ని, అది భిక్ష మాత్ర‌మే అని, 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ట్టు లెక్క అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కంగ‌నా. ఇంకే ముంది? బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌న్నీ ఏక‌మైపోయాయి. కంగ‌న‌నా దేశ ద్రోహిగా చిత్రీక‌రించ‌డం మొద‌లెట్టాయి. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది త్యాగ మూర్తుల‌ను కంగ‌నా అవ‌మానించింద‌ని, కంగ‌నాని అరెస్ట్ చేయాల‌ని, ఆమెకు ఇచ్చిన ప‌ద్మ‌శ్రీని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని ర‌క‌ర‌కాల డిమాండ్లు.

కంగ‌నా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకుంది. రెండు రోజులు అయ్యిందో లేదో.. ఆమె చేతి నుంచి ప‌ద్మ‌శ్రీ జారిపోయేలా ఉంది. దానికికార‌ణం.. ప‌క్కాగా మ‌ళ్లీ కంగ‌నానే. దేశ స్వాతంత్ర్యం కోసం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి, ఇప్ప‌టికీ దానికే క‌ట్టుబ‌డిఉంటానంటోంది కంగ‌నా. ఇవ‌న్నీ ప‌క్కా బీజేపీ ఫేవ‌ర్ కామెంట్ల‌న్న‌ది అంద‌రికీ తెలుసు. దేశంలో మోడీ మంత్రం ఇంకా బ‌లంగా వినిపించ‌డానికి, మోడీ – బీజేపీ త‌ప్ప ఈ దేశాన్ని పాలించ‌డానికి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెప్పుకోవ‌డానికి అప్పుడ‌ప్పుడు కంగ‌న లాంటి వాళ్ల‌తో పాచిక‌లు వేయించ‌డం అల‌వాటైన విష‌య‌మే. కంగ‌నా ఈ మ‌ధ్య కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి, బీజేపీ మైలేజీ పెంచ‌డానికి వీలైనంత వ‌రకూప్ర‌య‌త్నించింది. అందుకే ఆమెకు ప‌ద్మ‌శ్రీ కూడా వ‌చ్చింద‌ని బ‌య‌ట టాకు. ప‌ద్మ‌శ్రీ ఇలా అందుకుందో లేదో, అప్పుడే.. త‌న వ్యాఖ్య‌ల డోసు పెంచేసింది కంగ‌నా. ఇప్పుడు కూడా `నేనేమాత్రం త‌ప్పు మాట్లాడ‌లేదు. నా మొత్తం వీడియోలో మీరే ఎడిట్ చేసి, ఎలా కావాల‌నుకుంటే అల వాడుకుంటున్నారు. నా వ్యాఖ్య‌ల‌లో త‌ప్పు ఉంద‌ని ఎవ‌రైనా నిరూపిస్తే.. నా ప‌ద్మ‌శ్రీ వెన‌క్కి ఇచ్చేస్తా` అంటోంది కంగ‌నా. ఇప్పుడు శివ‌సేన నాయ‌కులు కంగ‌నా వ్యాఖ్య‌ల్లో దేశ ద్రోహం ఎంతుంది? అనే విష‌యాలపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా.. కంగ‌నాకొచ్చిన ప‌ద్మ‌శ్రీని లాగేయాల‌న్న‌ది బీజేపీ ఇత‌రుల కిం క‌ర్త‌వ్వంగా మారింది. మ‌రి ఇది ఎన్నాళ్ల ముచ్చ‌టో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close