ఆ గోరు ముద్దలు జగనన్నవి కావట !

జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అంటూ .. అంగన్‌వాడీ పిల్లలకు ఇస్తున్న ఆహారానికి పబ్లిసిటీ చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తక్షణం ఆ పథకాల పేర్లను మార్చేయాలని ఆదేశించింది. ఎందుకంటే.. ఆ పథకాలు కేంద్ర పథకాలు. వాటికి కేంద్రం నిధులిస్తోంది. వాటికి ప్రత్యేకంగా కేంద్ర పథకాల కింద నిధులిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్, వైఎస్ఆర్ పేరు మీద పెట్టిన పథకాలకు ఖర్చు చేస్తోంది. తక్షణం ఆ పేర్లు మార్చాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నుంచి తాఖీదు వచ్చింది.

అంతే కాదు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లు ఇచ్చామని.. ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలని లెక్కలు చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వానికి ఈ చిక్కులు తెచ్చి పెట్టింది ఎవరో కాదు.. రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజునే. ఆయన కేంద్రమంత్రికి పథకాల పేర్ల మార్పు.. నిధుల మళ్లింపుపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఏపీ ప్రభుత్వానికి తాఖీదు పంపారు. లెక్కలు చెప్పాలన్నారు.

ఇప్పటి వరకూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే జగనన్న గోరు ముద్ద.. జగనన్న పాలు.. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతోనే అమలు చేస్తున్నట్లుగా భారీగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ద్వారా రఘురామకృష్ణ రాజు అసలు విషయం బయటకు వచ్చేలా చేశారు. తాము లెక్కలు చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపామని.. రఘురామకృష్ణరాజు స్మృతి ఇరానీ ఆఫీసు నుంచి రిప్లయ్ కూడా వచ్చింది. ఇటీవల ఆ పథకం బిల్లులు కూడా చెల్లించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నిధులన్నీ దారి మళ్లాయో లేదో కూడా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close