లోక్‌సభలో “వైసీపీ ఆర్” వర్సెస్ వైసీపీ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎదుర్కోవడం మిగతా వైసీపీ ఎంపీలకు కష్టమై పోతోంది. ఆయన ప్రెస్మీట్లు పెట్టకుండా చేయాల్సినదంతా చేసినా .. చివరికి దేశద్రోహం కేసు పెట్టినా ఆపలేకపోయారు. ఇప్పుడు పార్లమెంట్‌లోనూ ఆయన మాట్లాడుతూండటంతో అడ్డుకోలేకపోతున్నారు. సోమవారం లోక్‌సభ జీవో అవర్‌లో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. రైతుల పాదయాత్రపై పోలీసుల దాడుల అంశాన్నిప్రధానంగా ప్రస్తావించారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని … రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వారిని తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా … క్షీణించాయి కాబట్టి లో్‌సభలో చెప్పక తప్పడం లేదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని రఘురామ సభ దృష్టికి తీసుకెళ్లారు. రఘురామను ఎలా ఆపాలో తెలియక వైసీపీ ఎంపీలు తంటాలు పడ్డారు. లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి.. సభలో రఘురామపై రాజకీయ విమర్శలు చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే రఘురామ కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై రెండే సీబీఐ కేసులు ఉన్నాయని. .. మీ నాయకుడిపై వంద కేసులున్నాయని.. వాటి సంగతి ముందు తేల్చాలన్నారు. వైసీపీ ఎంపీలు పరస్పరం తమ కేసుల గురించి చెప్పుకోవడం.. ఇతర పార్టీలు.. రాష్ట్రాల సభ్యులను ఆశ్చర్య పరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close