అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోనున్న సీబీఐ !?

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై సీబీఐ ఇప్పటికే ముందస్తు సన్నాహాలన్నీ చేసుకుంది. అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐకి స్పీకర్ అనుమతి కూడా ఇచ్చారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రెండు, మూడు రోజుల్లో ఆయనను అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు. అవినాష్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అవినాష్ రెడ్డి క్యాంప్ నుంచి ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీబీఐ పైన.. వైఎస్ వివేకా కుమార్తె పైనా ఆరోపణలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది.

కేసును ముందుకు తీసుకెళ్లకుండా ఒత్తిడి చేసే వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కొద్ది రోజులు విచారణ నిలిపివేసి ఢిల్లీకి వెళ్లారు. తిరిగి వచ్చి ఇప్పుడు నేరుగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూండటంతో.. ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close