మత మార్పిడి నిరోధక చట్టాలు తెస్తున్న రాష్ట్రాలు ! ఏపీ సంగతేంటి ?

బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాలు కొత్తగా చట్టాలను తీసుకు వస్తున్నాయి. తాజాగా ఏపీ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అలాంటి చట్టాన్నే అసెంబ్లీ ఆమోదించింది. మత మార్పిళ్లను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని చట్టాలు చేసిన ప్రభుత్వాలు నొక్కి చెప్పాయి. ఒడిశా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో ఈ మత మార్పిడి వ్యతిరేక చట్టాలున్నాయి. ఈ జాబితాలో కర్ణాటక చేరింది. మరికొన్ని రాష్ట్రాలు ఈ తరహా చట్టాలు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో చట్టాల్లో ఒకే రకమైన నిబంధనలు లేవు. చాలా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో గిరిజనులను క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అదే సమయంలో హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ల ద్వారా ఇస్లాంలోకి మారుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగా .. ఎవరి ప్రభావం ఎక్కువ ఉందో.. ఆయా రాష్ట్రాల్లో వారికి వ్యతిరేకంగా నిబంధనలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడుల అంశం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఏపీలోని గిరిజన నియోజకవర్గాల్లో క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడ్డాయని ఇప్పటికే అనేక నివేదికలు తేల్చాయి. ఇప్పుడు కొత్తగా గ్రామాల్లోనూ.. పట్టణాల్లోనూ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని అనేక ఆరోపణలు కేంద్రానికి వెళ్లాయి. నివేదికలు ఇవ్వాలని కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చినా పట్టించుకోలేదు.

ఇలాంటి సమయంలో ఏపీలోనూ మత మార్పిడి నిరోధక చట్టం అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రలోభాలు ఆశ పెట్టి.. లేకపోతే మరో కారణంతోనో మత మార్పిడి చేపడితే శిక్ష విధించాలన్న వాదన వినిపిస్తోంది. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అలాంటి ఆలోచన చేసే అవకాశం లేదు. ఎందుకంటే మత మార్పిళ్లకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం ఉందన్న అభిప్రాయం బలంగా ఉండటమే కారణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close