దోచుకుంటున్నారని తిడుతున్నా.. టాలీవుడ్‌లో ఎవరికీ రోషం రావడం లేదా!?

సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాని స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకంగా స్పందించేవారే ఎక్కువగా ఉన్నారు. ఆయనపై వైసీపీ నేతలు..క్యాడర్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వైసీపీ తరహా ఎదురుదాడి జరుగుతోంది. దీన్ని నాని పట్టించుకుంటారా లేదా అన్న సంగతి తర్వాత కానీ… టిక్కెట్ల వివాదంపై స్పందించడానికి మరో టాలీవుడ్ ప్రముఖుడికి మనసు రాలేదు. గతంలోప వన్ కల్యాణ్ స్పందిస్తే ఆయనను ఒంటరిని చేశారు. అప్పుడు కూడా నానిమద్దతిచ్చారు. కానీ ఇప్పుడు నాని మాట్లాడితే ఎవరూ బయటకు రావడం లేదు.

ఓ చిన్న హీరో మాట్లాడితే తాము మద్దతుగా రావడం అనేకంటే..తాము కూడా సొంతంగా గళం విప్పవచ్చు కదా అన్న ప్రశ్నలువస్తున్నాయి. టిక్కెట్ల వివాదంపై తమిళ హీరో సిద్ధార్థ స్పందించారు. నిజానికి సిద్ధార్థ తెలుగు సినిమాలు చేస్తున్నది తక్కువే.కానీ సిద్ధార్థది స్పందించే గుణం. గతంలో బీజేపీ నేతలను కూడా విమర్శించారు. ఇప్పుడు కూడా స్పందించారు. అలాంటి స్పందించే గుణం టాలీవుడ్‌లో ఇంకెవరికీ లేకుండా పోయింది. మంత్రులు బొత్స, అనిల్, కన్నబాబు లాంటి వాళ్లు టిక్కెట్ రేట్లతో దోచుకుంటున్నారని అదే పనిగా అంటున్నా ఒక్కరూ నోరు తెరవలేకపోతున్నారు.

ఇండస్ట్రీని ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నా… ఎందుకు స్పందించలేకపోతున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. వారి ఆస్తులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలోలేదు. అయినా కానీ టాలీవుడ్ పెద్దలు ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. ఇన్నాళ్లు తాము ఎదిగిన ఇండస్ట్రీని హీరోచితంగా కాపాడుకోకపోతే.. ఇప్పటి వరకూతెచ్చిపెట్టుకున్న హీరో ఇమేజ్‌లు ఎందుకూ పనికి రావని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close