టిక్కెట్ల అంశం ఫిబ్రవరి వరకు తేలదు.. !

టిక్కెట్ల వివాదాన్ని ఎటూ తేల్చకుండా చేసి ఈ పండగ సీజన్‌లో టాలీవుడ్ కు ఎంత నష్టం కలగచేయాలో అంతాచేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. సోమవారం హైకోర్టులో జరిగిన విచారణలో అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు విచారణనుఫిబ్రవరి పదో తేదీకి వాయిదా వేసింది. టికెట్ల ధరలను నిర్దేశిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కమిటీ వేసి ధరలను ఖరారుచేయాలని హైకోర్టు ఆదే్శించింది.

అయితే హైకోర్టు సూచనల మేరకు అధికారులతో పాటు టాలీవుడ్ ప్రతినిధులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ సమావేశం ఓ సారి జరిగింది. మరో వారంలో మరోసారి జరగనుంది . ప్రత్యేకంగా సమయం లేకపోయినా ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా చర్చలు పూర్తి కాలేదు బట్టి అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వం సమయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

టిక్కెట్ల ధరలు అతి తక్కువగా ఉండటంతో పెద్ద సినిమాల నిర్మాతలు సినిమాల విడుదల చేయడాన్ని నిలిపివేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్‌లోనూ కొత్తగా ఈ అంశంపై రచ్చ ప్రారంభమైంది. అందర్నీ కలుపుకుని వెళ్లి ప్రభుత్వంతో చర్చించాలంటూ మోహన్ బాబు సినీ పరిశ్రమకు బ హిరంగ లేఖ రాయడం కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close