ఆర్కే పలుకు : అధికారవ్యతిరేక ఓట్లు చీల్చే వ్యూహంలో కేసీఆర్ !

ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత బాగా ఉందని కేసీఆర్‌కు అర్ధమయింది. ఆ వ్యతిరేకత ఒక వైపు వెళ్తే మొత్తానికి మోసం వస్తుంది. అదే రెండు, మూడు వైపులకు తిరిగితే.. బయటపడవచ్చు. కేసీఆర్ ఆలోచన ఇదేనని అందుకే.. బీజేపీని ప్రతిపక్ష పార్టీగా ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్నా బీజేపీ – టీఆర్ఎస్ యుద్ధంపై ఆయన తనదైన విశ్లేషణ చేశారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా బీజేపీకి లేని పోని హైప్ కేటాయించి … ఆ పార్టీకి కాస్త ఊపు తెచ్చే అవకాశం కల్పిస్తున్నారని విశ్లేషించారు. ఎందుకంటే అధికార ఓట్ల చీలిక కోసం అంటున్నారు.

తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదు. హుజురాబాద్‌లో గెలిచిందంటే ఈటల చేరడం వల్లనే. అంతకు ముందు అక్కడ ఆ పార్టీ కి వెయ్యి ఓట్లు కూడా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీకి అలా కాదు. దాదాపుగా ప్రతి గ్రామంలోనూ క్యాడర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్లుగా కనిపిస్తే అది డేంజర్ అవుతుంది. ేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ వ్యూహం మార్చి బీజేపీని ప్రమోట్ చేస్తున్నారు. త్రిముఖ పోటీ వచ్చేలా చూసుకుంటే ఓట్ల చీలిక అనివార్యమని.. అది టీఆర్ఎస్‌కు లాభిస్తుందనేది కేసీఆర్ ప్లానని ఆర్కే చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని బయటపడేయడం కష్టమని ఆర్కే చెబుతున్నారు. జగ్గారెడ్డి చేస్తున్న రచ్చ.. రేవంత్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరించే శైలితో ఆ పార్టీ కోలుకోవడం కష్టమని అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తే కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందన్నట్లుగానే ఆర్కే రాసుకొచ్చారు. ఇక ఏపీలో పరిస్థితులపైనా ఓ కాలమ్ రాశారు. కానీ కొత్తగా రాసిందేమీ లేదు. చట్టాలను.. రాజ్యాంగాలను పట్టించుకోకుండా పాలన చేస్తున్నారు కాబట్టి… స్వతంత్ర దేశంగా ప్రకటించకుకోవాలని జగన్‌కు ఆర్కే సలహా ఇచ్చేశారు. జగన్‌కు ఓట్లేసినందుకు ఉద్యోగులు సహా ప్రజలు అంతా…, రివర్స్‌లో బాధపడుతున్నారని ఆయన అంచనా వేశారు.

ఆర్కే ప్రతీ వారం ఆర్టికల్‌లో ఓ లాజిక్ ఉంటుంది. ఈ సారి ఆర్టికల్‌లో అలాంటివేమీ కనిపించలేదు. ఏదో ప్రతీ వారం రాయాలి కాబట్టి రాశాం అన్నట్లుగా ఉంది. కొత్త విషయాల ఏమీ చెప్పలేకపోయారు. ముఖ్యంగా ఏపీ విషయంలో ఆయన …చెప్పేవన్నీ దాదాపుగా ప్రతివారం చెప్పేవే ఉంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close