మోడీకి కేసీఆర్ మరో వ్యతిరేక లేఖ…జగన్‌కు మాత్రం ధైర్యం చాలట్లేదా !?

ఏపీలో రాజకీయం అంతా అధికారుల్ని అడ్డం పెట్టుకునే చేస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు భయంతో ప్రభుత్వం ఏం చేయమన్నా చేస్తున్నారు. ఏ రకమైన స్టేట్‌మెంట్లు ఇవ్వమన్నా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ఆ సివిల్ సర్వీస్ అధికారులందర్నీ తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. కేడర్ రూల్స్ మార్చేస్తోంది. ఎప్పుడు కేంద్రానికి రావాలంటే అప్పుడు వచ్చేలా రూల్స్ మార్చేస్తోంది. దీన్ని బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఎలాగూ వ్యతిరేకించలేవు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి.

ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకించి తీరాలి. లేకపోతే కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోతారు. అప్పుడు చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేడర్ రూల్స్ మార్పును అంగీకరించబోమన్నారు. కేసీఆర్ మాత్రమే కాదు కేరళ జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ చివరికి బిహార్‌లో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వాగతించాలన్న ఆలోచనలో ఉన్నారు.

మొత్తం కేంద్రం గుప్పిట్లోకి తీసుకున్నా ఎందుకు స్వాగతించే ఆలోచనలో ఉన్నారో ఏపీ ప్రజలకు బాగానే తెలుసు. కానీ హక్కులన్నీ ధారాదత్తం చేసి తర్వాత తమను తాము ఎలా కాపాడుకుంటారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. కేంద్రానికి ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేని దుస్థితిని ఆసరా చేసుకుని కేంద్రం కూడా ఒక్కో ఆధికారాన్ని వెనక్కి తీసుకుంటోంది. రేపు తేడా వస్తే ఏపీలో అధికారంలో ఉన్నా లేనట్లేనన్న పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close