పబ్లిసిటీ కోసం సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు !

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలి కాలంలో నోరు కాస్త పెద్దది చేసుకుటంున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు వచ్చినా పబ్లిసిటీనే కదా… అలాంటి పబ్లిసిటీ వస్తే చాలు ఇమేజ్ వస్తుందని ఆశపడుతున్నారేమో కానీ ముందూ వెనుకా చూసుకోకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కడప జిల్లా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో సీరియస్‌గా తీసుకుని బూతులు తిడుతున్నారు. కడప జిల్లాలో ఎయిర్‌పోర్టు ఎందుకు వాళ్లకి ప్రాణం తీయడమే వచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున సోము వీర్రాజుపై బండ బూతులతో విరుచుకుపడుతున్నారు. సోము వీర్రాజు ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ చెప్పిన విధానం.. వాడిన మాటలు మాత్రం సరి కాదు. దీంతో ఆయనకు తిట్లే రిప్లయ్‌గా వస్తున్నాయి. ఇటీవల సోము వీర్రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో ముందున్నారు. చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తానంటూ బహిరంగసభలో ప్రకటించి .. ఆయన దేశవ్యాప్తంగా బీజేపీకి చెడ్డపేరు తీసుకు వచ్చారు. తనకు మాత్రం పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన అర్థం లేని ఆవేశానికి లోనవుతున్నారు. ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారో బీజేపీ నేతలకే అర్థం కావడం లేదు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే వివాదాస్పద ప్రకటనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ.. తనేమీ చేయలేకపోయానని.. ఆయన తరహాలో కామెంట్లు చేసి ప్రచారం పొందే ప్రయత్నంలో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే ఇది రాంగ్‌రూట్లో వెళ్తోందని ఫీడ్ బ్యాక్ వస్తోంది. మరి సోము వీర్రాజు కరెక్ట్ చేసుకుంటారో లేదో .. ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close