పార్లమెంట్‌లోనూ బీజేపీతో టీఆర్ఎస్ కయ్యమే !

బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న కేసీఆర్.. ఢిల్లీలో ఆ పోరాటాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో కూడా ఆందోళనలు చేయనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో మధ్యలోనే బాయ్ కాట్ చేసి వచ్చారు. దీని వల్ల బీజేపీతో ఫ్రెండ్లీ ఫైట్ అనే విమర్శలు వచ్చాయి. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకుండా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

తొమ్మిది మంది లోక్‌సభ, ఆరుగురు రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం అయి… వారికి దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్లో తెలంగాణలో ఎప్పటిలాగానే మొండి చేయిచూపే అవకాశం ఉంది. దీన్నే ఆసరాగా చేసుకుని ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులకు ఇప్పటివరకు సానుకూల స్పందన రాకపోవడం, రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం, కేంద్రం దగ్గర పేరుకుపోయిన బకాయిలు వాటిపై కేంద్రాన్ని నిలదీయాని కేసీఆర్ ఎంపీలకు సూచించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల ఆర్థిక సాయాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్‌‌రావు, కేటీఆర్ ఇటీవల లేఖలు రాశారు. నవోదయ విద్యాలయాలు, రైల్వేకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ కూడా లేఖలు రాశారు. వీటిపై స్పందన రాకపోతే.. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేయాలని కూడా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close