పారితోషికంతో భ‌య‌పెట్టిన రాజ‌శేఖ‌ర్‌

గోపీచంద్ – శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబుని ఎంచుకున్నారు. నిజానికి ఈ క్యారెక్ట‌ర్ కోసం ముందుగా రాజ‌శేఖ‌ర్ ని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. ఆయ‌న కి కూడా ఈ క్యారెక్ట‌ర్ న‌చ్చి ఓకే చెప్పాడు. కానీ పారితోషికం ద‌గ్గ‌రే పేచీ వ‌చ్చింది. ఈ క్యారెక్ట‌ర్ కోసం రాజ‌శేఖ‌ర్ రూ.5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సోలో హీరోగా గా ఎంచుకున్నా రాజ‌శేఖ‌ర్ కి అంత ఎవ‌రూ ఇవ్వ‌డం లేదు. చిత్ర‌బృందం రూ.4 కోట్ల వ‌ర‌కూ బేరం ఆడిన‌ట్టు టాక్‌. కానీ రాజ‌శేఖ‌ర్ కింద‌కి దిగ‌క‌పోవ‌డంతో… నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గి జ‌గ‌ప‌తిబాబుతోస‌ర్దుకుపోయారు.

గోపీచంద్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ అన‌డం కంటే, గోపీచంద్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ విల‌న్ అంటే కాస్త క్రేజ్ వ‌చ్చేది. అందుకే నిర్మాత‌లు సైతం 4 కోట్ల వ‌ర‌కూ భ‌రించ‌డానికి రెడీ అయ్యారు. కానీ.. ఒక కోటి ద‌గ్గ‌ర లెక్క మారిపోయింది. రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా ఒప్పుకోవ‌డం వ‌ల్ల‌… క‌మ‌ర్షియ‌ల్ గా ఈ సినిమాకి వ‌చ్చే ప్ల‌స్ పాయింట్స్ ఏమీ ఉండ‌వు. గోపీచంద్ మార్కెట్ ఎంత ఉందో, అంత‌కే ఈ సినిమా అమ్ముడుపోతుంది. కానీ ప్రేక్ష‌కుల్లో కాస్త ఆసక్తి ఏర్ప‌డుతుంది. అందుకే.. నిర్మాత‌లు చివ‌రి నిమిషం వ‌ర‌కూ రాజ‌శేఖ‌ర్ నే ఎంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర్లేదు. నిజానికి ఇలాంటి ఆఫ‌ర్లు రాజ‌శేఖ‌ర్‌కి ఇది వ‌ర‌కూ వ‌చ్చాయి. కానీ ఏదో ఓ కార‌ణంతో ఆయా ఆఫ‌ర్ల‌ని ఆయ‌న వ‌ద‌లుకున్నారు. నిజంగా రాజ‌శేఖ‌ర్‌కి పారితోషికం న‌చ్చ‌క ఆయా సినిమాలు చేయ‌డం లేదా? లేదంటే `నో` చెప్ప‌డం ఇష్టం లేక‌.. ఇలా పారితోషికం వంక పెడుతున్నారా? అనేది సందేహంగా మారిందప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close