“జగన్ సూట్‌కేస్” కంపెనీల గుట్టుపై రఘురామ కన్ను !

న్యాయవ్యవస్థ పరిమితులపై అసెంబ్లీలో చర్చించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో వైపు ఆయనపై అక్రమాస్తుల కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ పైపైన విచారణ జరిపి వదిలేసిందని..అత్యంత కీలకమైన సూటక్ కేసు కంపెనీలు, విదేశీ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై వివరాలు సేకరించలేదని.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేశారు. ఆ వివరాలు మొత్తం బయటకు తీసుకు వచ్చి సమగ్ర విచారణ జరిపించేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. విచారణకు రావడం లేదు. దీనిపై ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను వివిధ కారణాలు చూపుతూ రిజిస్ట్రినే నిలిపివేశారు.

పిటీషన్ విచారణకు అర్హత ఉందా? లేదా? అన్నది ధర్మాసనం తేలాల్సి ఉందని వెంటనే ఆ పిటీషన్ కు నెంబరు కేటాయించాలనిర రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ.. విదేశాలనుంచి, బోగస్‌ కంపెనీలనుంచి జగన్‌ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి వదిలేసిందని పిటిషన్‌లోరఘుురామ వివరించారు. 2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్‌ 2009లో తండ్రి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

హౌరా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు జగతిలోకి వచ్చాయని, వీటిపై దర్యాప్తును ఐటీ, ఈడీలకు లేఖ రాయటంతో సరిపెట్టిందన్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని రఘురామ కోరుతున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని హైకోర్టు తేలిస్తే.. సీబీఐ, ఈడీలు ఈ సారి అక్రమాస్తుల కేసు మూలాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close