” దేశ్ కీ నేత ” రేసులోకొచ్చిన కేజ్రీవాల్!

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పోటీగా ఎవరు ఉంటారనే అంశంపై జరుగుతున్న రేసులోకి.,. తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ దూసుకొచ్చారు. ఇప్పటి వరకూ మమతా బెనర్జీ, కేసీఆర్ ఆ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీలతో సాధ్యం కాదని.. ఇతర పార్టీల నేతలను కూడా దగ్గరకు తీసుకుంటున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం ఎవరితోనూ కలవకుండా తమ పార్టీనే జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఢిల్లీ బయట కేజ్రీవాల్ పార్టీ ఓ పెద్ద రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పడింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాము కూడా ఆయా రాష్ట్రాల్లో ఎదుగుతామని డాన్సులు కూడా చేశారు. చివరికి ఏపీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భవిష్యత్ తమదేనని ధీమాగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఇక అంతో ఇంతో ఉనికి కనిపించే రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు.

సంప్రదాయ రాజకీయ పక్షాలకు భిన్నమైన పార్టీగా 2013లో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చితే ప్రస్తుత ఆప్ ఒక ‘కొత్త’ పార్టీ అనుకోవచ్చు. మ‌రిన్ని రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ ప్రాభవం పెంచుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి విప‌క్షాల త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కేజ్రీవాల్ ఆవిర్భ‌వించినా ఆశ్చ‌ర్యం లేద‌న్న‌ది రాజ‌కీయ నిపుణుల అభిప్రాయం. దిల్లీని ఒక మోడల్‌గా చేసి దానిని జాతీయ స్థాయిలో అందించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారు. అయితే దానికి ఇప్పుడు లభించిన విజయాలు సరిపోతాయా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

మిగతా రాజకీయ నేతలందరూ… కూటమి కట్టి బలంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు. కానీకేజ్రీవాల్ తన పార్టీనే ఎదిగేలా చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు “దేశ్‌ కీ నేత” రేసులోకి మరొకరు పెరిగిటన్లయింది. చివరికి ఎవరు ఉంటారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close