మీడియా వాచ్ : సాక్షి సీఈవోగా ఆడిటర్ !

సాక్షి మీడియా సీఈవోను మార్చేశారు. తెలుగు రాకపోయినా గొప్ప మేనేజర్ అనో లేకపోతే… ఇతర మీడియా గ్రూపులతో ఉన్న ఆర్థిక సంబంధాల కారణంగానో కానీ వినయ్ మహేశ్వరి అనే ఉత్తరాది వ్యక్తికి మూడేళ్ల కిందట సీఈవో పోస్ట్ ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన చేతుల మీదుగానే వ్యాపార వ్యవహారాల నడుస్తున్నాయి. అయితే హఠాత్తుగా ఆయనను సీఈవో పదవి నుంచే.. కాదు మొత్తంగా ఉద్యోగం నుంచి తప్పించి నార్త్‌కుపంపేసినట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో జగన్ కుటుంబానికి సన్నిహితుడైన సనత్ రెడ్డి అనే ఆడిటర్‌ను సీఈవోను చేశారు.

వినయ్ మహేశ్వరి సీఈవోగా బాధ్యతలు తీసుకునేటపప్పుడు ప్రింట్‌కు సవాళ్లు లేవు. ఆయన దైనిక్ భాస్కర్ గ్రూపు నుంచి వచ్చారు. కానీ కరోనా దెబ్బకు మొత్తం అతలాకుతలం అయిపోయింది. సాక్షి లాంటి పత్రికలు ఆర్థికంగా బయటపడటం కష్టంగా మారింది. అదే సమయంలో అధికారం అందడంతో నిలబడ్డారు కానీ.. సాక్షికి ఉన్న ఖర్చులు..ఇతర ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే కొలాప్స్ అయిపోయి ఉండేదన్న అభిప్రాయం ఉంది. దీన్ని మెరుగుపర్చడానికి వినయ్ మహేశ్వరి ఏమీ చేయలేకపోయారని.. సాక్షి ని కొత్త తరం మీడియా వైపు మళ్లించడంలోనూ ఆయన పెద్దగా చొరవ చూపలేకపోయారన్న అసంతృప్తితో బయటకు పంపేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడు సన్నిహితులైన ఆడిటర్‌నే సీఈవోగా నియమించారు. దీంతో ఇప్పుడు సాక్షిఆర్థికంగా కుదుటపడే లెక్కలకు ఇబ్బందికరం ఉండదని భావిస్తున్నారు. కొత్త సీఈవో పత్రికను నాలుగు జోన్లుగా విభజించి నలుగురు మేనేజర్లను పెట్టుకుని పనులు చక్కబెట్టాలనుకుంటున్నారు. ఈ మేరకు నియామకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close