విక్రం రెడ్డి పేరు పంపిన మేకపాటి కుటుంబం – జగన్ అంగీకరిస్తారా !?

మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త మంత్రులను జగన్ సెలక్ట్ చేసుకుంటున్నారు. నెల్లూరు నుంచి దివంగత మంత్రి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తికి కేబినెట్‌లో చాన్స్ ఇచ్చి ఉపఎన్నికల్లో నిలబెడతారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో కంగారు పడిన మేకపాటి కుటుంబం… గౌతంరెడ్డి సోదరుడు విక్రం రెడ్డి పేరును సీఎం జగన్‌కు పంపింది. గౌతంరెడ్డికి బదులుగా ఆయన సోదరుడు విక్రం రెడ్డి రాజకీయాల్లోకి వస్తారని.. ఆయన పేరును పరిశీలించాలని కోరింది.

సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారాఈ విషయాన్ని జగన్‌కు చేర వేసినట్లుగా మేకపాటిక కుటుంబీకులు చెబుతున్నారు. ఈ విషయం జగన్‌కు చేరిందో లేదో కానీ మీడియాకు మాత్రం సమాచారం అందింది. విక్రంరెడ్డి ప్రస్తుతం మేకపాటి కన్‌స్ట్రక్షన్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు. గతంలో గౌతంరెడ్డి చూసుకునేవారు. ఆయన తర్వాత విక్రం రెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు విక్రంరెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.

అయితే మేకపాటి కుటుంబానికి ఈ సారి మంత్రివర్గంలో బెర్త్ ఇవ్వడం అసాధ్యమని భావిస్తున్నారు. గౌతంరెడ్డి చనిపోయినందున ఆయన కుటుంబానికి అవకాశం ఇస్తారని చాలామంది భావస్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం ఆలాంటి ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఉపఎన్నికల్లోనూ మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో కుమారుడికి కాకుండా.. భార్యకే టిక్కెట్ ఇస్తామని తేల్చి చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా జగన్ తీరు వల్ల మేకపాటి కుటుంబంలో వివాదాలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం నెల్లూరు రాజకీయాల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖరీదైన స్థలం కొని ఘోరంగా మోసపోయిన జూ.ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే...

ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈసీ సంచలన నిర్ణయం

ఏపీలో పరిస్థితులు నివ్వురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. పల్నాడు, అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో...

బలిచ్చింది జవహర్ రెడ్డే – ఆయన తప్పించుకోగలరా ?

ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాత్మక ఘటనలకు కారణం చూపి కొంతమంది పోలీసు అధికారులపై ఈసీ వేటు వేసింది. ఇలా పలువురిపై వేటు వేసేలా... తప్పంతా వాళ్లపై తోసేసి నివేదికలు ఇచ్చింది సీఎస్...

ఐ ప్యాక్ కే పాఠాలు బోధిస్తున్న జగన్ రెడ్డి -విషయం ఏంటంటే..?

2019 నుంచి వైసీపీకి రాజకీయంగా సేవలందిస్తోన్న ఐ ప్యాక్ టీమ్ కు జగన్ రెడ్డి పాఠాలు బోధించడం రాజకీయ వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది.కొన్నేళ్లుగా ఐ ప్యాక్ డైరక్షన్ లో సాగుతున్న జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close