బీజేపీకి ఆయుధంగా అక్బరుద్దీన్ కేసు తీర్పు !

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన రెండుకేసులను కోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పు అందర్నీ ఆశ్చర్య పరిచింది. నిర్మల్‌తో పాటు మరో చోట హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించింది. హిందూ దేవతలను అవమానపరుస్తూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్ లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దాదాపుగా నెలన్నర పాటు ఈ కేసుల్లో జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కేసుల్లో సాక్ష్యాలు తెలంగాణ పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారు. దీన్ని బీజేపీ ఆయుధంగా చేసుకుంది.

న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలనివాటిని రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించ లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్కక్కయ్యరనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ కేసు తీర్పుపై రెండురోజులు ఉత్కంఠ నెలకొంది. అయనకు శిక్ష ఖాయమని అందరూ అనుకున్నారు.

కానీ కేసును నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో న్యాయమూర్తి కూడా ఇది సంబరాల చేసుకునేది కాదని మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయన్నారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎంకు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ హిందువుల్ని అన్నన్ని మాటలన్నా… వదిలి పెట్టారన్న ఆరోపణలు బీజేపీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close