ఆచార్య నుంచి మరో ట్రైలర్ ?

కొరటాల శివ వంద శాతం సక్సెస్ రేటు వున్న దర్శకుడు. ఆయన సినిమాలన్నీ విజయాలే. అయితే కొరటాల సినిమాలన్నీ మిక్సడ్ టాక్ తోనే మొదలౌతాయి. ఫస్ట్ షోతోనే పక్కా కమర్షియల్ హిట్ అనే టాక్ తెచ్చుకున్న సందర్భాలు తక్కువ. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు అయితే చాలా స్లోగా ఉన్నాయనే టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నుంచి ‘ఆచార్య’ సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ నుంచే మిశ్రమ స్పందన వస్తుంది.

ఆచార్య ట్రైలర్ చాలా మంది మెగా ఫ్యాన్స్ కి పెద్ద కిక్ ఇవ్వలేదు. బేసిక్ గా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలనే హైప్ మూమెంట్ రావాలి. అలాంటి హై ఆచార్య ట్రైలర్ క్రియేట్ చేయలేకపొయిందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. కొరటాల హీరో క్యారెక్టరైజేషన్ చాలా కామ్ గా వుంటుంది. మెగాస్టార్ కి ఇమేజ్ కి ఇది భిన్నం. మెగాస్టార్ అంటేనే హుషారు. ఆ హుషారు ఆచార్య ట్రైలర్ లో మిస్ అయ్యింది. అందుకే ఇప్పుడు చిత్ర యూనిట్ మరో ట్రైలర్ ని కట్ చేయాలనీ నిర్ణయించుకుంది. ఇటివల భీమ్లా నాయక్ సినిమాకి కూడా ఇదే జరిగింది. మొదటి రిలీజ్ చేసిన ట్రైలర్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వలేదు. దీంతో రెండో ట్రైలర్ కట్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ఇప్పుడు ఆచార్య టీమ్ కూడా మరో సాలిడ్ ట్రైలర్ ని కట్ చేసే పనిలో వుందని తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close