‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ డైలాగ్ ఎందుకంటే..?

స‌ర్కారు వారి పాట‌లో… డైలాగుల్ని కుమ్మ‌రించేశాడు ప‌ర‌శురామ్‌. స్వ‌త‌హాగా ర‌చ‌యిత కాబ‌ట్టి… త‌న పంచ్ ప‌వ‌ర్‌, పెన్ ప‌వ‌ర్ చూపించేశాడు. ఎక్కువ డైలాగులు మాసీగానే ఉన్నాయి. అయితే.. అందులో `నేను ఉన్నాను.. నేను విన్నాను` డైలాగ్ మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఈ డైలాగ్ ఎందుకు రాయాల్సివ‌చ్చిందో.. కార‌ణం ఇప్పుడు చెప్పుకొచ్చాడు ప‌ర‌శురామ్‌.

“నాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయ‌న‌కు హీరో వర్షిప్ ఉండేది. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన `నేను ఉన్నాను.. నేను విన్నాను` అనే పొలిటిక‌ల్ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా అర్థం ఉంది అందులో. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్క‌లో భ‌లే చెప్పారు అనిపించింది. అలాంటి సంద‌ర్భం `స‌ర్కారు వారి పాట‌`లో ఒక‌టి వ‌చ్చింది. క‌థానాయిక కీర్తి సురేష్‌కి అలాంటి భ‌రోసానే హీరో ఇవ్వాల్సివ‌చ్చిన‌ప్పుడు ఈ డైలాగ్ ప‌ర్‌ఫెక్ట్ గా స‌రిపోతుంద‌నిపించింది. స్క్రిప్టు రాస్తున్న‌ప్పుడే ఈ డైలాగ్ ఉంది. మ‌హేష్ కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఎలాంటి డిస్క‌ర్ష‌న్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది“ అని చెప్పుకొచ్చారు ప‌ర‌శురామ్‌. ఈనెల 12న స‌ర్కారు వారి పాట విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత‌.. నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close