జగన్‌లో కొత్త భయాలు పుట్టిస్తున్న భేటీలు!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గురించి.. ఆ పార్టీనుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోతుండడం గురించి.. జగన్‌ ఎంత మేరకు ఎలా స్పందిస్తున్నారనే సంగతి తరవాత… అయితే తాజా పరిణామాల్లో ఆయన జిల్లాలనుంచి ఎమ్మెల్యేలను పిలిపించి.. వారికి ధైర్యం చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ పరిస్థితి గురించి ఆందోళన వద్దని, జగన్‌ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఒక్కొక్క జిల్లాలనుంచి వారిని పిలిపించి భేటీలు అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ పరిణామాల్ని కాస్త లోతుగా గమనిస్తే.. జగన్‌ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం సంగతి తరవాత.. ఈ భేటీల పుణ్యమాని ఆయనలోనే కొత్త భయాలు పుట్టుకువచ్చే పరిస్థితి కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాల ఎమ్మెల్యేలతో శుక్రవారం మొత్తం విడతలుగా భేటీలు జరిపిన జగన్‌లో పార్టీ పరిస్థితి గురించి కొత్త ఆందోళనలు పుడుతున్నాయని పార్టీ నాయకులే చెబుతున్నారు.

దీనికి ఒక బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు చూడడం మానలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహనరెడ్డి కాస్త వ్యూహాత్మకంగా అడుగులు కదిపారు. వెళ్లిపోతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను మాత్రం పిలిపిస్తే వారికి అవమానంగా ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాల వారీగా సమావేశాలు అని ప్రకటించారు. ఆ మేరకు శుక్రవారం గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీలు ఉంటాయని తొలుత వార్తలు వచ్చాయి. కానీ సాయంత్రానికి వాస్తవాల్ని పరిశీలిస్తే ఆయా జిల్లాలనుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన అందరు ఎమ్మెల్యేలూ మాత్రం రానేలేదు. ఏదో తమకు వీలు చిక్కిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం జగన్‌తో భేటీలకు వచ్చి వెళ్లారు. రాకుండా మిగిలిపోయిన వారు చాలా మందే ఉన్నారు. నిజానికి పార్టీ వీడిపోతారనే పుకార్లు ఆ గైర్హాజరీ ఎమ్మెల్యేల చుట్టూతానే తిరుగుతున్నాయి.

జగన్‌ పరిస్థితి చూస్తే.. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం కాదు కదా.. వారంతా కలిసి ఆయనకు ధైర్యం చెప్పడానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. వెళ్లిపోతున్న వారిని ఆపడానికి, ఒకవేళ వారు వెళ్లిపోతే.. ప్రత్యామ్నాయంగా పార్టీ బలాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాలను జగన్‌ వారితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

ట్విస్టు ఏంటంటే.. జగన్‌ పాపం.. తనకున్న పరిమితమైన సమయంలో క్షణం కూడా వృథా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. శుక్రవారం ఆయన నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిన రోజు. ఈ రోజున ఆయన ఎక్కువ సమయం కోర్టులోనే గడపాల్సి వచ్చింది. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులతో ఆయన అక్కడే భేటీలు వేశారు. బాలినేనితో కలసి వచ్చిన ఎమ్మెల్యేలు కోర్టు వద్దనే కాసేపు జగన్‌ తో మాట్లాడి.. తమ నాయకుడు చెప్పినట్లుగా తమను కూడా ఫోన్లలో సంప్రదిస్తున్నారని, కానీ పార్టీ వీడి వెళ్లేది లేదని ముక్తసరిగా ప్రకటించి వెళ్లిపోవడం విశేషం. కోర్టులో న్యాయమూర్తి పిలుపుకోసం నిరీక్షిస్తూ కూడా జగన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పార్టీ మీటింగులు నిర్వహించేయడమే కొసమెరుపు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close