పవన్ సాయం చేస్తున్నది రైతు కుటుంబాలకు కాదంటున్న సీఎం జగన్ !

పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని కూడా చూపించలేకపోయారని సీఎం జగన్ తేల్చేశారు. రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… తాను చేస్తున్న మంచి చెప్పుకునేదాని కన్నా …చంద్రబాబు, పవన్ ను విమర్శించాడనికే ఎక్కువ సమయం కేటాయించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్రపై విమర్శలు గుప్పించారు. కౌలు రైతుల కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న రైతుల్లో ఎవరు ఆత్మహత్య చేసుకున్నా తమ ప్రభుత్వం పరిహారం ఇస్తోందని ఎవరికీ ఆపలేదని చెప్పుకొచ్చారు. నిజానికి ఒక్కో జిల్లా వంద మందికిపైగా కౌలు రైతులకు పవన్ కల్యాణ్ సాయం చేస్తున్నారు. అదంతా ఆయన సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు.

పవన్ ఏదైనా జిల్లాకు వెళ్తూంటే హడావుడిగా ఒకరిద్దరు రైతు కుటుంబాలకు సాయం మంజూరు చేసేది ప్రభుత్వం. దానికే అందరికీ ఇచ్చేస్తున్నామని చెప్పుకుంటున్నారు జగన్. అప్పట్లో చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వ్యవసాయం దండగన్నారని.. మరోసారి పాత రికార్డే చెప్పుకొచ్చారు. తమ పాలనలో రైతులకు ఎక్కువ దిగుబడి వస్తోంది… విస్తారంగా నీరు అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. అప్పుడు దుష్టచతుష్టయం ప్రశ్నించలేదన్నారు. గత పాలనకు ఇప్పటికి ఉన్న తేడాను రైతులు గుర్తించాలని జగన్ చెప్పుకొచ్చారు.

2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. అయితే ఈ మొత్తం … విడుదల చేస్తే ఒక్కో రైతుకు ఏడున్నర వేలు రావాలి. కానీ ఐదున్నర వేలు మాత్రమే జమ చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. కానీ స్టేజ్‌పై చెక్కు మాత్రం రూ.3,758 కోట్లకు ఉంది. అంటే అది ఫేక్ చెక్కన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంత కంటే తక్కువే విడుదల చేసి.. నెలాఖరులో కేంద్రం ఇచ్చే రూ. రెండు వేలకు కూడా తమ ఖాతాలో కలుపుకుని చెక్‌పై నెంబరేశారని సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close