సొంత ఎంపీ ఆరోపణల్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం !

ఏపీలో ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ చేయించాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు.కలెక్టర్‌ను కలిసి ఆధారాలు సమర్పించి సీఐడీ విచారణ కోరుతానని ప్రకటించిన బోస్ ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ హైకమాండ్ ఈ అంశంపై ఇక మాట్లాడవద్దని ఆదేశించడంతో ఆయన ఆగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన అలా ఫోన్ ఆపేసుకుని సైలెంటయిన వెంటనే అమరావతిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు .. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టారు.

పిల్లి సుభాష్ మాట్లాడింది స్కాం గురించి కాదన్నారు. బోస్ ఈకేవైసీలో జరుగుతోన్న జాప్యం గురించి మాత్రమే మాట్లాడారని కవర్ చేశారు. ఎంపీ చెప్పినట్లుగా అవతవకలు జరిగే ఆస్కారమే లేదని తేల్చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు నమోదు చేసి.. మిగతా రెండు ఎకరాలు వేరే వాళ్ల పేర్ల మీద నమోదు చేసే చాన్స్ లేదన్నారు.
తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఎంపీ బోస్ చెప్పినప్పటికీ..అధికారులు మాత్రం అలా జరిగే చాన్స్ లేదన్నారు.

అసలు ఏం జరిగిందో బోస్ నుంచి వివరాలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సిద్దపడలేదు. స్కాం అనగానే.. ఎక్కడ బయటకు వస్తుందో అని టెన్షన్ పడి.. ఎంపీ నోరు మూయించేందుకు ప్రయత్నించారు కానీ.. ఆ సాక్ష్యాలేవో తీసుకుని స్కాంను బయట పెట్టి రైతుల్ని ఆదుకుందామన్న ఆలోచన చేయలేదు. ఆ స్కామేదో తామే చేస్తున్నట్లుగా.. మంత్రి , అధికారులు కంగారు పడిపోయి మీడియా ముందుకు కవరింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సొంత పార్టీ ఎంపీ చేసిన ఆరోపణపై విచారణ జరిపిస్తే ఏమవుతుందని సామాన్యులు కూడా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close