మిషన్ తెలంగాణ… ఈ సారి మూడు రోజులు మోదీ మకాం ! !

తెలంగాణలో అధికారం చేపట్టడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్‌ను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేస్తూ ఇప్పటికే అనేక రకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోనే నిర్వహించాలని నిర్ణయించారు. జులై నెలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. మూడు రోజల పాటు హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.

ఈ సమావేశాల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తే దేశం మొత్తం చూపు తెలంగామ వైపే ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీని దెబ్బకొట్టాలని ఒకరి రెండు నెలల్లో సంచలనం నమోదు చేస్తానని కేసీఆర్ చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించడమే సంచలనంగా చాలా మంది భావిస్తున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ వచ్చే నెలకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో కానీ… తెలంగాణలోనే మకాం వేస్తామని మోదీ, అమిత్ షా నేరుగా కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. బీజేపీకి కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. దేశం మొత్తం తెలంగాణలో బీజేపీ వైపు చూస్తూంటే… ఆ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ రాజకీయం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close