ఏపీ ఇక యూపీ – బుల్డోజర్ బ్రాండ్ !

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారీతిన కూల్చివేతలు జరుగుతున్నాయి. బుల్డోజర్ పాలన సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై బుల్డోజర్లతో విరుచుకుపడే కొత్త సంప్రదాయాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఎప్పుడో నోటీసులు ఇచ్చామన్న పాత కాగితాలను సృష్టించి తెల్లవారు జామున మూడు గంటలకు ఇంటిపైకి బుల్డోజర్‌తో వెళ్లడమనే ఊహే సామాన్యంగా ఎవరికీ రాదు. కానీ ప్రభుత్వ పెద్దలకు వచ్చింది. పై స్థాయిలో వారు చెబితే తప్ప అధికారులు ఇలా చేయరు. ఓ బలమైన ప్రతిపక్ష నేత ఇంటిని కూల్చివేయాలంటే.. పై స్థాయి అనుమతులు ఉండాలి.

ఖచ్చితంగా ఇది ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయమే. కూల్చివేయాలన్న కుట్రతోనే ఇలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజంగా అక్కడ ఆక్రమణ ఉందా.. ఉంటే ఎంత ఉంది.. ఇలాంటి వివరాలేమీ లేవు. రెండు సెంట్లు అని ఒక సారి చెబుతారు.. 0.2 సెంట్లు అని మరోసారి చెబుతారు. ఎంత ఆక్రమణ ఉందో ఎప్పుడు సర్వే చేశారో తెలియదు. సర్వే చేసి. నోటీసులు ఇచ్చి.. తొలగించడానికి వారికి సమయం ఇవ్వడం చట్టం. కానీ అలా చేయకుండా ఇవ్వని నోటీసులను పాత తేదీలతో సృష్టించుకుని వచ్చి కూల్చివేతలకు పాల్పడటం అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే.

చట్ట విరుద్ధమైన కూల్చివేతలు జరిగితే తీవ్రంగా పరిగణిస్తమని సుప్రీంకోర్టు ఓ వైపు హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులు.. వర్గ శత్రువులపై బుల్డోజర్లతో వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పాలనపై ప్రజల్లోనూ భయం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం అంటే భయపెట్టి పాలన చేయాలి.. ఎవరూ నోరెత్తకూడదు.. ఎవరైనా నోరెత్తితే బుల్డోజర్ వస్తుందన్న ఆలోచనతో పాలన సాగించాలన్న వ్యూహం కనిపిస్తున్నట్లుగా ఉంది.

అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఉన్నంత వరకూ భయపడతారేమో.. రేపు పాలకుల్ని ఎంపిక చేయాలనుకున్నప్పుడు… ఓటు అనే వజ్రాయుధం వాళ్ల దగ్గర ఉంటుంది. దాంతో వారు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఆ విషయం గుర్తు పెట్టుకోడం ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసేవాళ్లకు ప్రధానంగా ఉండాల్సిన లక్షణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close