వైసీపీని చిందరవందర చేసిన జనసేన ఎమ్మెల్యే !

రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ చిందర వందర అయిపోయింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజుతోపాటు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి సుందరపు బుల్లబ్బాయి రాజీనామా చేశారు. ఈ రోజు వైఎస్ఆర్‌సీపీరాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు రాజీనామా చేశారు.కేవలం పార్టీ పదవినే కాకుండా.. ఆ పార్టీలోని ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అతనితోపాటు అతని అనుచరులు కూడా పార్టీకి దూరమయ్యారు.

వీరి అసంతృప్తి అంతా ఒక్కటే. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఇటీవల ఆయనకు వైసీపీ ఇంచార్జ్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పటి నుండో పార్టీలో ఉన్న తమను పట్టించుకోకుండా రాపాకకు ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆగ్రహంతో రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా వారిని పట్టించుకోవడం లేదు. రాపాక వరప్రసాదే తమకు ముఖ్యం అన్నట్లుగా ఉండటంతో అందరూ రాజీనామా బాట పట్టారు.

రాజోలులో గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని కాదని వైఎస్ఆర్‌సీపికి మద్దతు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనే నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే పార్టీలో చాలా కాలం నుంచి ఇతర నేతలు ఈ కారమంగా అసంతృప్తికి గురవుతున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రాపాకను నియోజకవర్గ ఇన్చార్జిగా అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అయితే… జనసేన పార్టీకి చెందిన ఇతర నేతలు ఎక్కడా చేయనంత నష్టం వైసీపీకి.. ఎమ్మెల్యే రాపాక చేశారని ఆ పార్టీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close