ఇప్పటికీ వైసీపీ నేతలకు పద్దతులు నేర్పాలని పవన్ ప్రయత్నం !

వైసీపీ అంటేనే బూతుల బ్రాండ్. ఎప్పుడో ఫిక్సయిపోయింది. వాళ్లపైన.. వీళ్లపైనే కాదు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు.. వారి కుటుంబాలపైనా బూతులతో దాడి చేయడం కామన్ . ఆ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నో సార్లు స్వయంగా ఫేస్ చేశారు కూడా. కాకినాడ సిటీ ఎమ్మెల్యే దగ్గర్నుంచి అంబటి రాంబాబు వరకూ అందరూ బూతులు మాట్లాడారు. పవన్ కల్యాణ్ తమను ఎప్పుడు టార్గెట్ చేసినా … సాఫ్ట్‌గా స్పందిస్తూంటారు. మరోసారి అంటే ఊరుకునేది లేదంటారు. ఈ సారి కూడా అలాగే స్పందించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దారుణమైన భాషతో విరుచుకుపడ్డారు.

అవి ప్రసారం చేసిన టీవీ చానళ్లపై కేసులు పెట్టారు. ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ బాలినేని గారూ మీ అనుచరులకు పద్దతులు నేర్పండి అంటూ ప్రకటన జారీ చేశారు. ఓ వైపు వైసీపీ నేతలు ఇంత దారుణంగా విరుచుకుపడుతూంటే .. పద్దతుల గురించి పవన్ మాట్లాడుతూండటంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. మాటకు మాట అంటే తప్ప వాళ్లు తగ్గే అవకాశం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే రియలైజ్ అయ్యారు. వాళ్లు ఒకటంటే.. అంతకు మించి అనడం ప్రారంభించారు. వైసీపీ నేతలు కేసులు పెట్టినా.. జేసీబీలతో ఇంటిపైకి విరుచుకుపడుతున్నా వెనక్కి తగ్గడం లేదు.

నాలుగు అంటూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్ పద్దతులు నేర్పాలని ప్రయత్నిస్తూండటం జనసేన వర్గాలకూ ఆశ్చర్యకరంగానే ఉంది. వైసీపీ నేతలు కొత్తగా గీత దాటడం లేదని.. గత మూడే్ళ్లుగా వారు అదే పని చేస్తున్నారని.. వారికి సాఫ్ట్‌గా సమాధానం చెబితే అది చేతకానితనంగా తీసుకుంటున్నారని… రివర్స్ పంచ్‌లు ఇవ్వాల్సిందేనన్న వాదన జనసైనికుల్లోనూ ఉంది. పవన్ కల్యాణ్ నుంచి ఆ ఫోర్స్ ను వారు ఆశిస్తున్నారు. కానీ జనసేన మాత్రం… పద్దతి.. పద్దతి అంటూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close